గత కొంత కాలంగా బీహార్ రాష్ట్రంలో సంపూర్ణ మద్యపాన నిషేదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పదవీ బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఈ నిర్ణయం తీసుకున్నారు. కొంతమంది అక్రమార్కులు గుట్టు చప్పుడు కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా మద్యం, నాటు సారా తరలిస్తూ అడ్డగోలుగా డబ్బు సంపాదిస్తున్నారు. అదే సమయంలో కొన్నిసార్లు పోలీసులకు పట్టుబడుతూ జైలుకు వెళ్తున్నారు. ఓ పోలీస్ స్టేషన్ లో కస్టడీలో ఉన్న కొంతమంది ఖైదీలు ఏకంగా స్టేషన్ లోనే లిక్కర్ పార్టీ చేసుకున్నారు. పోలీసుల ఎంట్రీతో సీన్ రివర్స్ అయ్యింది.. ఈ ఘటన బీహార్ లో చోటు చేసుకుంది.
పాట్నాలో గురువారం అక్రమంగా మద్యం సరఫరా చేస్తున్న ఐదుగురిని ఎక్సైజ్ డిపార్ట్ మెంట్ పోలీసులు పట్టుకొని పాలీగంజ్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ కి తరలించారు. అంతవరకు బాగానే ఉంది.. కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ చోటు చేసుకుంది. గురువారం రాత్రం పోలీస్ స్టేషన్ లో ఉన్న ఐదుగురు ఖైదీలు మద్యంతో పార్టీ చేసుకున్నారు.. వారికి ఇద్దరు పోలీసులు కూడా సహకరించారు. తాము చేసేది గొప్ప పని అన్నట్టు అందులో ఓ వ్యక్తి ఆ దృశ్యాలను వీడియో తీసి తన కుటుంబ సభ్యులకు పంపాడు. ఆ వీడియో కాస్త వైరల్ కావడంతో ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది.
వీడియోలో ఉన్న దృశ్యాలు చూసి పోలీసు ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు.. లాకప్ లోనే ఖైదీలు మద్యం సేవిస్తు ఉండగా.. వారికి ఇద్దరు కానిస్టేబుళ్లు కంపెనీ ఇవ్వంపై ఆగ్రహించిన ఉన్నతాధికారులు చర్యలపకు పూనుకున్నారు. ఈ విషయం గురించి పోలీస్ ఉన్నతాధికారి మాట్లాడుతూ.. పాలీగంజ్ పోలీస్ స్టేషన్ లో కొంతమంది మద్యం సేవించడం తమ దృష్టికి వచ్చిందని.. వీరికి సహకరించిన పోలీసులపై చర్యలు తీసుకుంటామని.. ఈ కేసులో మొత్తం ఏడుగురిని అరెస్ట్ చేశామని తెలిపారు. స్టేషన్ లోకి మద్య ఎలా వచ్చిందన్న విషయంపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Bihar | 7 people arrested for having a liquor party in the custody of Excise Dept in Patna’s Paliganj
We received info about it. We went to verify it & found them drinking alcohol. All are prisoners. How they got alcohol & other things are part of probe: SDPO, Paliganj (01.12) pic.twitter.com/ffEywk1VX4
— ANI (@ANI) December 2, 2022