బైసాఖీ పర్వదినాన ఘోర విషాదం చోటుచేసుకుంది. బైసాఖీ వేడుకలకు హాజరైన ప్రజలు.. ఆ ఆనందంలో ఉండగానే ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఫుట్ బ్రిడ్జ్ కూలి 40 మందికిపైగా గాయపడ్డారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
బైసాఖీ వేడుకల్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. జమ్మూకశ్మీర్, ఉదమ్పూర్ జిల్లాలోని బేని సంగంపై నిర్మించిన ఫుట్ బ్రిడ్జ్ కూలి 40 మందికిపైగా గాయపడ్డారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి. బ్రిడ్జి కింద చిక్కుకున్న వారిని కాపాడి సమీప ఆస్పత్రులకు తరలించారు. ఓవర్ లోడ్ కారణంగానే ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.
ఈ ఘటనపై జమ్మూ డివిజనల్ కమిషనర్ మీడియాతో మాట్లాడుతూ.. భారీ సంఖ్యలో ప్రజలు ఒక్కసారిగా బ్రిడ్జ్ పైకి చేరడంతో ఓవర్ లోడ్ కారణంగా వంతెన కూలినట్లు తెలిపారు. ఈ ఘటనలో 40 మందికి పైగా గాయపడ్డారని, వీరిలో 20-25 మంది పరిస్థితి విషమంగా ఉందని వెల్లడించారు. పోలీసులు, రెస్క్యూ సిబ్బంది వంటనే స్పందించి ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారాణి వెల్లడించారు. గాయపడ్డ వారిలో కొందరిని జిల్లా ఆసుపత్రికి, మరికొందరిని చెనానీలో ఆసుపత్రులకు తరలించినట్లు మున్సిపాలిటీ చైర్మన్ మాణిక్ గుప్తా తెలిపారు. ఈ ఘనటకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
#WATCH | J&K: A footbridge collapsed during the Baisakhi celebration at Beni Sangam in Bain village in Udhampur’s Chenani Block
Six people were injured during the incident. A rescue operation is underway. Police and other teams have reached the site: Dr Vinod, SSP Udhampur… pic.twitter.com/2jGn1QxLpX
— ANI (@ANI) April 14, 2023