ఫుట్ బోర్డు ప్రయాణం ఎంత ప్రమాదకరమే చాటి చెప్పే ప్రత్యక్ష ఘటన ఇది. బస్ కిక్కిరిసి ఉండటంతో యువతి ఫుట్ బోర్డు ప్రయాణం చేయగా, అదే తన ప్రాణాలు తీసింది.
నిత్యం రోడ్డు ప్రమాదాల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్న వారు ఎందరో ఉన్నారు. క్షణికావేశంలో చోటుచేసుకునే ఈ రోడ్డు ప్రమాదాలు ఎన్నో కుటుంబాల్లో విషాదాన్ని నింపుతున్నాయి. ఈ ఘటనల్లో ఎక్కువ శాతం ఎదుటివారి తప్పిదం వల్లే జరుగుతున్నప్పటికీ, కొన్ని సందర్భాల్లో మనం చేసే పొరపాట్లే మన ప్రాణాలు తీస్తుంటాయి. ఆ కోవకు చెందిందే ఈ వార్త. బస్ కిక్కిరిసి ఉండటంతో యువతి ఫుట్ బోర్డు ప్రయాణం చేస్తోంది. ఈ క్రమంలో బస్ ఓ మలుపు వద్ద వేగంగా ప్రయాణించడతో సదరు యువతి పట్టు కోల్పోయి జారి పడింది. దీంతో ఆమె అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ విషాద ఘటన తమిళనాడు రాష్ట్రం సేలంలో చోటుచేసుకుంది.
సేలం జిల్లాలోని వెన్నండూర్ ప్రాంతానికి చెందిన కౌసల్య(20) అనే యువతి రెండు నెలల క్రితం మల్లసముద్రంలోని ఓ వస్త్ర దుకాణంలో పనిలో చేరింది. యువతి సొంతూరైన వెన్నండూర్ నుంచి మల్లసముద్రానికి 10 కిలోమీటర్ల దూరం ఉండటంతో యువతి ప్రతి రోజూ బస్సులో వెళ్లి వెళ్లేది. రోజూలాగానే మే 3న బుధవారం పనికి వెళ్లింది. అక్కడ పని వేళలు ముగియగానే సాయంత్రం తన చెల్లితో కలిసి ఇంటికి వెళ్లేందుకు ఈరోడ్లో బస్సు ఎక్కింది. ఆ సమయంలో బస్సు కిక్కిరిసి ఉండడంతో చెల్లిని అక్కడే ఉన్న తోటి ప్రయాణికురాలికి అప్పజెప్పి ఆమె ఫుట్బోర్డుపై నిల్చుంది.
ఇలా ప్రయాణం చేస్తుండగా బస్సు అత్తయ్యంబట్టి సమీపంలో ఓ మలుపు వద్ద కాస్త వేగంగా ప్రయాణించింది. అంతే యువతి పట్టు కోల్పోయి ఒక్కసారిగా బస్సులోంచి జారి రోడ్డుపై పడిపోయింది. దీంతో ఆమె తలకు తీవ్ర గాయాలవ్వడంతో అక్కడిక్కడే ప్రాణాలు విడిచింది. స్థానికులు అప్రమత్తమైనప్పటికీ ఫలితం లేకపోయింది. క్షణాల్లోనే ఆమె ప్రాణాలు విడిచింది. సమాచారం అందుకున్న పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి సంబంధించి దృశ్యాలు అక్కడే ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి.
#சேலம் ஆட்டையாம்பட்டி அருகே பஸ்ஸிலிருந்து தவறி விழுந்த இளம்பெண்ணின் பதறவைக்கும் சிசிடிவி காட்சிகள். #cctv #viralvideo #viralvideos #viral #cctvvideo #salem #erode #tiruchengode #salemdist #salemnews #chennai #bus #busaccident #accident #tamil #tamilnadu pic.twitter.com/fCGt4dGNL4
— Discovery Salem 24 /7 (@SalemDiscovery) May 4, 2023