ప్రపంచ వ్యాప్తంగా ఒమిక్రాన్ అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతుంది. దక్షిణాఫ్రికాలో గత నెలలో వెగులుచూసిన కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ పంజా విసురుతోంది. భారత్ లోనూ ఈ రకం కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం కొత్త వేరియంట్ కేసుల సంఖ్య సెంచరీకి చేరువైంది. ఓ వైపు నిపుణులు హెచ్చరిస్తున్నట్టే చాపకింద నీరులా ఒమిక్రాన్ వేరియంట్ విస్తరిస్తోంది. మన దేశంలో ఇప్పటి వరకు నమోదైన ఒమిక్రాన్ కేసులు సెంచరీకి చేరువలో ఉన్నాయి.
దేశ రాజధాని ఢిల్లీలో కేవలం ఒకే రోజులో 10 కేసులు నమోదు కావడం కలకలం రేపుతోంది. నాలుగు నెలల తర్వాత ఢిల్లీలో నిన్న కరోనా కేసులు ఒక్కసారిగా పెరిగాయి. భారత దేశంలో ఇప్పటి వరకు 11 రాష్ట్రాలకు ఒమిక్రాన్ వేరియంట్ వ్యాపించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ అధికారి లవ్ అగర్వాల్ కాసేపటి క్రితమే ప్రకటన చేశారు. దేశం లో ఇప్పటి వరకు 101 కి ఒమిక్రాన్ కేసులు చేరినట్లు ఆయన వివరించారు. మహా రాష్ట్ర లో 32 కేసులు, ఢిల్లీలో 22 కేసులు, రాజస్థాన్లో 17 కేసులు, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రల లో 8 కేసులు నమోదు అయినట్లు లవ్ అగర్వాల్ ప్రకటన చేశారు.
ఇదీ చదవండి : మహిళ పాదాలను తాకి ఆశీర్వాదం తీసుకున్న ప్రధాని మోదీ!
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో రెండు ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదైనట్లు వివరించారు. విదేశాల నుంచి వచ్చిన వారిలో చాలా మందికి కరోనా పాజిటివ్ వచ్చిందని తెలిపారు. క్రమంగా అన్ని రాష్ట్రాలకు ఒమిక్రాన్ వ్యాపిస్తుండటంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. జాగ్రత్తగా ఉండాలని ప్రజలను హెచ్చరిస్తున్నారు. తప్పనిసరిగా మాస్క్ ధరించాలని, నిబంధనలు పాటించాలని హెచ్చరించారు.
There are 101 Omicron cases across 11 states in the country: Lav Agrawal, Joint Secretary, Health Ministry pic.twitter.com/2OPjHBQ38b
— ANI (@ANI) December 17, 2021