ముంబై క్రైం- క్షణికావేశం ప్రాణాలను తీస్తోంది. కన్నపిల్లలపైనా అంతులేన కోపాన్ని చూపిస్తున్నారు కొంత మది తల్లిదండ్రులు. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన కన్నబిడ్డల జీవితాలను చేతులారా చిదిమేస్తున్నారు. అర్ధం పర్దం లేని ఆవేశంతో పిల్లల ప్రాణాలను హరిస్తున్నారు. ముంబైలో జరిగి ఓ అమానుష ఘటన అందరిని కంటతదిపెట్టిస్తోంది. తన బిడ్డను కన్న తల్లే చంపుకోవడం కలకలం రేపుతోంది.
తూర్పు ముంబైలోని విరార్ ప్రాంతానికి చెందిన 22 ఏళ్ల నేహా సోనీకి రెండేళ్ల పాప ఉంది. ఆమె భర్త ఆటో డ్రైవర్గా పని చేస్తున్నాడు. అంతే కాదు ప్రస్తుతం నేహా సోనీ గర్భవతి కూడా. ఆదివారం భర్త ఆటో తీసుకొని బయటకు వెళ్లిపోగా, ఇంట్లోనే ఉన్న నేహ సోనీ పడుకుంది. ఆమె రెండేళ్ల పాప నీళ్లతో ఆడుతోంది.
నిద్రలోంచి లేచి వచ్చిన ఆమె, నీళ్లతో ఆడుతున్న కూతురును చూసి పెద్ద ఎత్తున ఆగ్రహానికి గురైంది. వెంటనే ఆ చిన్నారిని నేలకేసి విసిరి కొట్టింది. పక్కనే ఉన్న గోడకు పాప తల తాకడంతో పెద్ద ఎత్తున రక్తశ్రావం అయ్యింది. దీంతో ఏంచేయాలో పాలపోని నేహా, కూతుర్ని వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లింది. చిన్నారి శరీరంలోని కీలక ఆవయవాలు దెబ్బతినడంతో చిన్నారి అప్పటికే చనిపోయింది.
నేహ ఇంటి చుట్టు పక్కల వాళ్లు ఈ విషయాన్ని పోలీసులకు చెప్పారు. దీంతో రంగప్రవేశం చేసిన పోలీసులు నేహపై హత్య కేసు నమోదు చేసి ఆమెను అరెస్ట్ చేశారు. పసితనంతో సరదాగా నీళ్లతో ఆడుకున్న ఆ చిన్నారిని కన్న తల్లే చంపుకోవడం స్థానికులను కంటతడి పెట్టించింది.