న్యూ ఢిల్లీ- కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం చాలా పధకాలను అమలుచేస్తోంది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పధకం ద్వార ఒక్కో రైతుకు ప్రతి సంవత్సరం 6 వేల రూపాయలను అందిస్తోంది. ఈ క్రమంలో రైతులకు మోదీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మూడు విడతలుగా రైతులకు ఈ డబ్బు అందుతోంది. ఈ సంవత్సరం ఒక విడత రెండు వేలు ఉందించిన కేంద్రం, ఇప్పుడు రెండో విడత కింద రైతులకు రెండు వేల రూపాయలను అందిస్తోంది.
కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్ కింద మోదీ సర్కార్ రైతుల అకౌంట్లలోకి క్రమం తప్పకుండా నేరుగా బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు జమ చేస్తోంది. దీంతో దేశంలో రైతులకు ఊరట కలుగుతోంది. ఈ డబ్బులతో రైతులు వ్యవసాయానికి కావాల్సిన విత్తనాలు, ఎరువులను కొనుక్కుంటున్నారు. ఈ క్రమంలో మోదీ ప్రభుత్వం ఇప్పుడు మరోసారి రైతుల బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు జమచేయనుంది. ఈ పధకాన్ని ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు
కేంద్ర ప్రభుత్వం 8 విడతలుగా డబ్బును రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేసింది. ఇప్పుడు 9వ విడత డబ్బులు పంపేందుకు సిద్దం అవుతోంది. ఆగస్ట్ 9న 2 వేల రూపాయలను రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేసేందుకు ఏర్పాట్లు చేసింది. సోమవార పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద రైతుల ఖాతాల్లోకి డబ్బులు రానున్నాయి.
ఇక పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పధకం కింద డబ్బులు వచ్చాయా, రాలేదా అన్న విషయాన్ని సులభంగానే తెలుసుకోవచ్చు. డబ్బులు అకౌంట్ లో జమ కాగానే మీ బ్యాంక్ నుంచి మీకు మెస్సేజ్ వస్తుంది. లేదంటే పీఎం కిసాన్ అధికారిక వెబ్సైట్ లో మీ ఆధార్ కార్డు వివరాలను ఎంటర్ చేస్తే పీఎం కిసాన్ డబ్బులు వచ్చాయో లేదో తెలుసుకోవచ్చు.