హైదరాబాద్ క్రైం- దేశంలో హత్యలు, అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. ఆడవాళ్లపై అఘాయిత్యాలకు అంతే లేకుండా పోతోంది. ఎక్కడ, ఎప్పుడు ఏ అమానుషమైన ఘటనకు సంబందించిన వార్త వినాల్సి వస్తోందోనని అంతా ఆందోళన చెందే పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటి వరకు బయట ప్రాంతాల్లో జరిగిన హత్యాయత్నాలనే మనం చూశాం. కానీ హైదరాబాద్ లో ఏకంగా ప్రభుత్వ ఆస్పత్రిలోనే రేప్ జరిగిన ఘటన కలకలం రేపుతోంది.
తెలంగాణలో అతి పెద్ద ప్రభుత్వ ఆస్పత్రి గాంధీ హాస్పిటల్ లో ఈ అమానుష ఘటన జరిగింది. వైద్యం కోసం వచ్చిన ఇద్దరు అక్కాచెల్లెల్లపై ఆస్పత్రిలోని ల్యాబ్ టెక్నీషియన్ అత్యాచారానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఐతే అతనొక్కడే కాకుండా సెక్యూరిటీ గార్డ్, ఆస్పత్రి సిబ్బందికి చెందిన మరొకరు కూడా ఈ అత్యాచారంలో పాల్గొన్నట్లు సమాచారం. వీరంతా వైద్యం కోసం వచ్చిన అక్కా, చెల్లెలుపై సమూహిక అత్యాచారానికి పాల్పడినట్లు తెలుస్తోంది.
ఇప్పటికే కేసు నమోదు చేసిన పోలీసులు బాధితురాలి స్టేట్ మెంట్ రికార్డ్ చేశారని సమాచారం. అత్యాచారానికి పాల్పడ్డాడని భఆవిస్తున్న లాబ్ టెక్నీషన్ ఉమ మహేశ్వర్ ను పోలీసులు విచారిస్తున్నారు. సెక్యురిటీ గార్డ్ పరారీలో ఉండటంతో అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. ల్యాబ్ టెక్నీషియన్, సెక్యురిటి గార్డ్ తో పాటు ఇంకా ఎవరు అత్యాచారంలో పాల్గొన్నారనే కోణంలో పోలీసుల విచారణ జరుపుతున్నారు.
ఇది ప్రభుత్వ ఆస్పత్రికి సంబందించిన అంశం కావడంతో పోలీసులు రహస్యంగా విచారణ జరుపుతున్నారు. అత్యాచారానికి గురైన అక్కా, చెల్లెలు మహబూబ్ నగర్ కు చెందినవారని తెలుస్తోంది. ఐతే వాళ్లు ఎవరన్నది కూడా పోలీసులు భహిర్గతం చేయడం లేదు. ఈ ఘటనతో సంబందం ఉన్న వాళ్లందరిని పోలీసులు పట్టుకున్నాకే ఈ కేసుకు సంబందించిన పూర్తి వివరాలను తెలియజేసే అవకాశం ఉంది.