చత్తీస్ గఢ్- హత్యలు.. ఆత్మహత్యలు.. అత్యాచారాలు.. అక్రమ సంబంధాలు.. ఇప్పుడు ఎక్కడ చూసినా ఇవి తప్ప మరేం వినిపించడం లేదు. రోజు రోజుకు పెరిగిపోతున్న అరాచకాలను, అసాంఘీక కార్యకలాపాలపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. క్రైం రేట్ అంతకంతకు పెరుగుతుండటంతో సమాజం ఎటువైపు వెళ్తుందోనని అందరిలో కలవరం మొదలైంది.
తాజాగా ఓ నీచుడు తన స్నేహితుడి భార్యపైనే కన్నేసి, చెప్పు దెబ్బలు తిన్న ఘటన చత్తీస్ గఢ్ లో చోటుచేసుకుంది. బలోదాబజార్లో బీజేపీ కౌన్సిలర్ సూర్యకాంత్ తమ్రకర్ కొద్ది రోజుల కిందట తన స్నేహితుడి ఇంటికి వెళ్లాడు. అతని బార్యపై చాలా రోజులుగా కన్నేసిన కౌన్సిలర్, ఆమెను ఎలాగైనా లొంగదీసుకోవాలని అనుకున్నాడు. మెల్లిగా ఆమెతో మటలు కలిపి తన కోరికను స్నేహితుడి భార్య దగ్గర బయటపెట్టడా ప్రబుధ్దుడు. ముందు షాక్ తిన్న ఆమె సున్నితంగా అతని కోరికను తిరస్కరించింది.
అప్పుడు సైలెంట్ గా వెళ్లిపోయిన బీజేపీ కౌన్సిలర్, పదిహేను రోజుల తర్వాత మళ్లీ ఇంటికి వచ్చి తన కోరిక తీర్చాలని బలంవంతం చేశాడు. ఆమె కుదరదని గట్టిగా చెప్పడంతో ఏంమాట్లాడకుండా వెళ్లిపోయాడు. వెళ్లేటప్పుడు ఎప్పటికైనా లొంగదీసుకుంటానని శపధం చేసి వెళ్లాడు. దీంతో ఇక లాభం లేదని, మరో యువతిని తోడు తీసుకుని ఆ కౌన్సిలర్ షాప్ కు వెళ్లిందా మహిళ. స్నేహితుడి భార్య వదినమ్మతో సమానమని, ఇలా అడగడానికి మనసెలా వచ్చిందని గట్టిగా నిలదీసింది.
వదినా, మరుదుల మధ్య ఇలాంటివి సర్వసాధారణం అని కౌన్సెలర్ సిగ్గిలేకుండా చెప్పడంతో పాటు మళ్లీ ప్రలోభపెట్టే ప్రయత్నం చేశాడు. కోపం కట్టలు తెంచుకోవడంతో వెంటనే తన చెప్పు తీసుకుని అతడిని చెంపలు వాయించిందా మహిళ. అక్కడే ఉన్న భర్త ఆమెను అడ్డుకునే ప్రయత్నం చేయడంతో, అతన్నీ కూడా నాలుగు వాయించి, నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి పిర్యాదు చేసింది.
ఇంకేముంది రంగంలోకి దిగిన పోలీసులు సదరు బీజేపీ కౌన్సిలర్ ను అరెస్ట్ చేసి, విచారణ చేపట్టారు. తన భర్త అలా ఉండడం వల్లే బయటి వ్యక్తులు ఇంట్లోకి వస్తున్నారని, ఈరోజుతో తన వైవాహిక బంధం ముగిసిందని ఆ మహిళ పేర్కొంది.