ఫిల్మ్ డెస్క్- అన్నా చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక రాఖీ పండగ. ఈ ఆదివారం ఆగష్టు 22న రాఖీ పండగ నేపధ్యంలో మెగా డాటర్, నాగబాబు కుమార్తె, హీరోయిన్ నిహారిక తన అన్న వరణు తేజ్ కు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చింది. రాఖీ పండగ నేపధ్యంలో బ్రో సినిమా నుంచి విడుదలైన ‘అన్నయ్యా నువ్వు పిలిస్తే’ లిరికల్ సాంగ్ ను తన ప్రియమైన అన్నకు అంకితం చేస్తున్నట్లు నిహారిక తెలిపింది.
‘బ్రో’ సినిమాలో నటుడు నవీన్ చంద్రా, అవికా గోర్ కీలకపాత్రల్లో నటించారు. అన్నాచెల్లెళ్లు మధ్య ఉండే ప్రేమ, అనురాగం, ఆప్యాయతలు, సెంటిమెంట్లను చెప్పే విధంగా ‘బ్రో’ చిత్రం రూపొందుతోంది. త్వరలో విడుదలకు సిద్దమవుతున్న ‘బ్రో’ మూవీ నుంచి రాఖీ పండుగ నేపధ్యంలో ఓ లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. ప్రముఖ నేపధ్య గాయని సునీత ఈ పాటను పాడారు.
‘ఈ రోజు కోసం నేనెంతగానో చూస్తూనే ఉన్నాను ఇన్నాళ్లుగా’ అంటూ సాగే ఈ పాట ప్రతి ఒక్కర్నీ ఆకట్టుకుంటోంది. కార్తీక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి శేఖర్ చంద్రా సంగీతం అందించారు. ఇదిగో ఈ పాటనే నిహారిక తన అన్న వరణు తేజ్ కు రాఖీ పండగ సందర్బంగా అంకితమిచ్చింది. మరింకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ అన్నా చెల్లెళ్ల అనుబంధం పాటను విని ఆనందించండి.