ఫిల్మ్ డెస్క్- చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ సీనియర్ నటి కేపీఏసీ లలిత కన్నుమూశారు. దీంతో సినీ ఇండస్ట్రీలో విషాదం అలముకుంది. గత కొన్ని రోజులుగా లలిత అనారోగ్యంతో బాధపడుతోంది. కేపీఏసీ లలిత అసలు పేరు మహేశ్వరి అమ్మ. కేపీఏసీ సినిమాలో లలిత నటింటింది. అదిగో అప్పటి నుంచి అదే లలిత ఇంటి పేరుగా మారిపోయింది.
మలయాళం సినిమా కమర్షియల్ అండ్ ఆర్ట్ స్కూల్ రెండింటిలోనూ కేపీఏసీ లలిత బాగా రాణించింది. తన ఐదేళ్ల సినీ కెరీర్లో 550కి పైగా చిత్రాల్లో నటించింది లలిత. కేరళ సంగీత నాటక అకాడమీకి 5 సంవత్సరాలు చైర్ పర్సన్గా సేవలు కూడా అందిచారు. దివంగత మలయాళ చిత్ర నిర్మాత భరతన్ ను వివాహం చేసుకుంది లలిత.
తన కేరీర్ లో ఉత్తమ సహాయ విభాగంలో రెండు జాతీయ అవార్డులు, 4 రాష్ట్ర అవార్డులను గెలుచుకున్నారు లలిత. 74 ఏళ్ల లలితకు కుమారుడు సిద్ధార్థ్ భరతన్, కుమార్తె శ్రీకుట్టి భరతన్ ఉన్నారు. లిలిత మృతి పట్ల సౌత్ ఇండస్ట్రీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. పృథ్వీరాజ్ సుకుమారన్ తో పాటు అనేక మంది సెలబ్రిటీలు, రాజకీయనాయకులు సోషల్ మీడియా వేదికగా దిగ్భ్రంతి వ్యక్తం చేస్తున్నారు.
కేపీఏసీ లలిత మృతి పట్ల కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ సంతాపం తెలిపారు. లలిత తన నటనా నైపుణ్యంతో విభిన్న తరాల హృదయాల్లోకి అల్లుకుపోయారు.. చరిత్రలో నిలిచిపోయారు.. అని సీఎం పేర్కొన్నారు. లలిత మృతి పట్ల ప్రముఖ హీరోయిన్ కీర్తి సురేష్, మంజూ వారియర్ భావోద్వేగమయ్యారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.
Rest in peace Lalitha aunty! It was a privilege to have shared the silver screen with you! One of the finest actors I’ve known. 🙏💔#KPACLalitha pic.twitter.com/zAGeRr7rM0
— Prithviraj Sukumaran (@PrithviOfficial) February 22, 2022
Extremely saddened to hear about the passing of the legendary KPAC Lalitha aunty.
My heartfelt condolences to the family. pic.twitter.com/nGqxO5tpGb
— Keerthy Suresh (@KeerthyOfficial) February 22, 2022