ఎన్టీఆర్ 26వ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద లక్ష్మీ పార్వతి నివాళి అర్పించారు. ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడుతూ ఎన్టీఆర్ గురించి సంచలన విషయాన్ని వెల్లడించారు. ఎన్టీఆర్ ఆత్మతో తాను మాట్లాడానని ఆమె చెప్పారు. 26 ఏళ్ల తర్వాత ఈ విషయాన్ని బయటపెడుతున్నానని తెలిపారు.
భౌతికంగా ఆయన చనిపోయినప్పటకి, మానసికంగా అందరి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని తెలిపిన లక్ష్మీపార్వతి, ఎన్టీఆర్ చనిపోయినప్పుడు ఆయన ఆత్మ కోసం చాలా ప్రయత్నించానని తెలిపారు. జీవిత, రాజశేఖర్ లు తనను మద్రాస్ కు పిలుచుకుపోయి కుముద్విని అనే ఒక అమ్మాయితో మాట్లాడించారని, ఆ 16 ఏళ్ల అమ్మాయిలోకి ఎన్టీఆర్ ఆత్మ ప్రవేశించి తనతో మాట్లాడిందని తెలిపారు.
ఆ అమ్మాయి వెంటనే ఎన్టీఆర్ ల మారిందని ఆయనలా హూందాగా ప్రవర్తించిందని అన్నారు. ఆ సందర్భంలో తాను కూడా పలు ప్రశ్నలు అడిగానని తెలిపారు లక్ష్మీ పార్వతి. ఎన్టీఆర్ ఆత్మ తనతో ఎన్నో విషయాలను పంచుకుందని చెప్పారు.