కర్నూలు – మాతృత్వం ప్రతి స్త్రీ జీవితంలో మధురమైన జ్ఞాపకం. పెళ్లైన ప్రతి మహిళ బిడ్డల కోసం పరితపిస్తుంది. కానీ దురదృష్టవశాత్తు కొందరికి ఏళ్లు ఎదురు చూసిన సంతానం కలగరు. ఇక అలాంటి మహిళలు ఎదుర్కొనే అవమానాలు అన్ని ఇన్ని కాదు. ఇరుగుపొరుగు వారు, బంధువులు, ఆఖరికి సొంత వాళ్లు కూడా ఆమెను మాటలతో హింసిస్తారు. ఈ టార్చర్ తట్టుకోలేని వారు చివరకు తమ జీవితాలనే ముగించుకుంటారు. ఈ తరహా ఘటన ఒకటి ఆంధ్రపదేశ్, కర్నూలులో చోటు చేసుకుంది. ఆ వివరాలు…
ఆంధ్రప్రదేశ్, కర్నూలు నగరం పాతబస్తీకి చెందిన భారతి సి.బెళగల్ మండలం ఇకండ్ల ప్రభుత్వ పాఠశాల్లలో టీచర్ గా పనిచేస్తునారు. ఆమెకు మేనత్త కొడుకు, సొంత బావ అయిన గోపీ కృష్ణతో ఎనిమిదేళ్ల క్రితం పెద్దలు పెళ్లిచేశారు. కానీ వారికి ఇంకా సంతానం కలగలేదు. ఎందరు డాక్టర్లకు చూపించినా.. ఎన్ని పూజలు చేసినా.. ఫలితం కనిపంచలేదు. ఈ క్రమంలో ఇరుగుపొరుగు వారు, అత్తింటి వారతో సహా భర్త కూడా భారతిని గొడ్రాలు అంటూ దూషించారు.
ఇది కూడా చదవండి : ఆమెకు ఏ మాత్రం అనుమానం రాలేదు.. కానీ ఆ ఆటో డ్రైవర్
చివరకు కట్టుకున్న వాడు సైతం తనను గొడ్రాలు అనడంతో తీవ్ర మనస్థాపానికి గురైన భారతి.. ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇది గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించినప్పటికి ఫలితం లేకపోయింది. ఇక భర్త, అత్తింటి వారి వేధింపులు తాళలేకనే భారతి ఇలాంటి నిర్ణయం తీసుకుందని.. ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి : 65 ఏళ్ల ప్రియుడితో బరితెగించిన ప్రియురాలు.. అంతటితో ఆగక..!