ఇటలీకి చెంది వెలోరెటి కొత్తగా ఐవీ, ఏస్ పేర్లతో రెండు కొత్త సైకిళ్లను మార్కెట్లోకి తెస్తోంది. పూర్తిగా వింటేజ్ లుక్తో రూపొందించిన ఎలక్ట్రిక్ సైకిళ్లు ఇట్టే ఆకర్షించేలా ఉన్నాయి. ప్రస్తుతం పెట్రోల్ ధరలు సెంచరీ కొట్టాయి కాబట్టి పెట్రోల్ బండ్లు కొనాలంటే ప్రజలు భయపడుతున్నారు. అందుకే క్రమంగా ఎలక్ట్రిక్ వాహనాల వాడకం ఇండియాలో పెరుగుతోంది. అదే సమయంలో వాటి ధర క్రమంగా తగ్గుతోంది. ఇటలీకి చెంది వెలోరెటి ఐవీ, ఏస్ల మోడళ్లను ఒకే టెక్నాలజీతో తెస్తోంది. కేవలం ఫ్రేమ్స్ తేడా చూపించారు. ఈ సైకిళ్లలో 510 Wh బ్యాటరీలను అమర్చారు. ఒక్కసారి ఛార్జ్ చేసే 60 నుంచి 120 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయోచ్చు. హైడ్రాలిక్ బ్రేక్స్, ఇంటిగ్రేటెడ్ ఫ్రంట్, బ్యాక్ లైట్లను అమర్చారు.
ఆటోమేటిక్ గేర్ షిఫ్ట్ సిస్టమ్తో ఈ సైకిళ్లు రూపొందాయి. వింటేజ్ లుక్తో లేటెస్ట్ టెక్నాలజీ మిక్స్ చేసి వాలోరెటీ రూపొందించిన ఐవీ, ఏస్ మోడళ్లకు యూరప్లో క్రేజ్ ఏర్పడింది. దీంతో భారీ ఎత్తున సైకిళ్లు తయారు చేసే పనిలో ఉంది వెలోరెటి. యూరప్లో ఎక్కడికికైనా సరే పది రోజుల్లో డెలివరీ ఇస్తామంటూ హామీ ఇస్తోంది. ఈ సైకిల్ క్రేజ్ చూసిన తర్వాత త్వరలోనే మన దగ్గర కూడా ఇలాంటి సైకిళ్లు వస్తే బాగుండు అనుకుంటున్నారు నెటిజన్లు.