నేటికాలంలో చాలా మంది సొంతగా వ్యాపారం చేయాలనుకుంటారు. అయితే కొందరు మాత్రమే తమకు నచ్చిన రంగంలో బిజినెస్ పెడుతుంటారు. అందరిలాగానే ప్రభుత్వ ఉద్యోగులు కూడా సొంతంగా వ్యాపారం చేయాలని భావిస్తుంటారు. బిజినెస్ చేయాలని మనస్సు ఎంత అల్లాడినా.. చేతిలో ఉన్న సర్కారీ కొలువును వదులుకునే ధైర్యం చేయరు. ఎందుకంటే ఆసక్తి ఉన్న వ్యాపారం దెబ్బకొడుతే ఎలా? అనే భయంతో నెలకు ఠక్కున చేతిలోకి జీతం డబ్బులు వచ్చే ఉద్యోగాన్ని వదులుకునేందుకు రిస్క్ చేయరు. అలా ఎన్నో ఆశలు, ఆలోచనలు ఉన్న కూడా ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ జీవితాన్ని ముందుకు సాగిస్తుంటారు. అయితే ఇలాంటి వారికి కోసం యూఏఈ ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఉద్యోగం వదులుకోకుండానే ఏడాది పాటు వారి వ్యాపార కలను నెరవేర్చుకునే ప్రయత్నం చేయడానిక ప్రోత్సహిస్తోంది. అందులో భాగంగా వారికి జీతాలతో కూడిన ఏడాది సెలవును ఆ ప్రభుత్వం ప్రకటించింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే..
యూఏఈ ప్రభుత్వం.. తమ ఉద్యోగుల్లోని వ్యాపార ఆలోచనలను బయటకు తీసేందుకు విన్నుత నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగులకు వ్యాపారం చేయండని ప్రోత్సహిస్తూ ఏడాది పాటు సెలవును ప్రకటించింది. అందులో భాగంగా అక్కడి ప్రభుత్వ ఉద్యోగులు.. తమకు నచ్చిన సెక్టార్ లో వ్యాపార చేసేందుకు ప్రయత్నం చేయవచ్చు. అందుకోసం ప్రభుత్వ ఉద్యోగులందరికి ఏడాది పాటు సెలవులు ప్రకటించింది. అంతేకాక సెలవు పెట్టిన ఏడాది పాటు ఉద్యోగులకు నెల నెలా సగం జీతం కూడా ఇస్తామని యూఏఈ ప్రభుత్వం ప్రకటించింది. ఒక వేళ వ్యాపారం ప్రయత్నంలో విఫలమైతే తిరిగి తమ ఉద్యోగాల్లోకి వచ్చి చేరవచ్చని యూఏఈ ఉపాధ్యక్షడు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ చెప్పారు. వ్యాపారంపై ఆసక్తి ఉన్న ప్రభుత్వ ఉద్యోగులను అటువైపుగా ప్రోత్సహించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వివరించారు.
యూఏఈ ప్రభుత్వం ఇచ్చిన ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని భావించే ఉద్యోగులు.. వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. ఇలా ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో యూఏఈ ప్రభుత్వం అనేక ఆఫర్లు ప్రకటిస్తుంది. గతంలో కూడా ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగుల పనిదినాలను నాలుగున్నర రోజులకు కుదిస్తూ యూఏఈ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. తాజాగా మరోసారి ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. మరి.. ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో యూఏఈ ప్రభుత్వం తీసుకున్న ఏడాది సెలవుల నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.