భూమి లోపల, మీద అనేక అత్యంత విలువైన సంపద ఉంటుంది. అయితే కాలక్రమేణ అవి కనుమరుగై పోతుంటాయి. అలా వేల, వందల సంవత్సరా క్రితం అంతరించిపోయిన వివిధ రకాలైన ఖనిజ, వృక్ష, జంతువులకు సంబంధించిన అవశేషాలు అప్పుడప్పుడు బయట పడుతుంటాయి. అలా వెలుగులోకి వచ్చిన ఆ అరుదైన వస్తువులు, అవశేషాల విలువ తెలిసినప్పుడు మనం షాక్ అవుతుంటాము. తాజాగా అలానే తవ్వకాల్లో బయటపడిన ఓ పుర్రె ఖరీదు రూ.162 కోట్లు అంటా. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అది కూడా వేల సంవత్సరాల క్రితం భూమిపై సంచరించిన డైనోసర్ అనే ఓ రాక్షస బల్లి పుర్రె. ఈ డైనోసర్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మనం నిజంగా చూడకపోయినా.. అనేక సినిమాలో వీటిని చూశాం. అత్యంత అరుదైన జాతిలో డైనోసర్ ఒకటి. జీవ జాతుల్లోని అతి పెద్ద వాటిల్లో ఒకటిగా డైనసర్స్ కి పేరు. 162 కోట్లు పలుకుతున్న ఆ డైనోసర్ పుర్రె ప్రత్యేకలు ఏమిటో ఇప్పుడు చూద్దాం…
అమెరికాలోని సౌత్ డకోటాలో టీ రెక్స్ డైనోసర్ పుర్రెను పరిశోధకులు కనుగొన్నారు. ఇదోక ప్రత్యేకమైన, విలక్షణమైన పుర్రెని వారు చెబుతున్నారు. ఎలాంటి రసాయనాలతో సురక్షితంగా భద్రపరచక పోయినప్పటికీ ఈ పుర్రె చెక్కు చెదరకుండా ఉంది. దీంతో పురావస్తు శాస్త్రవేత్తలు సైతం ఆశ్యర్యపోతున్నారు. బయటపడిన ఈ పుర్రె ఉపరితలం చాలా వరకు పాడవ్వకుండా ఉంది. అంతేకాక అతి సున్నితమైన ఎముకలు సైతం చెక్కు చెదరకుండా ఉన్నాయని పరిశోధకులు తెలిపారు. ఇంకా ఆ డైనోసర్ పుర్రె గురించి వారు మాట్లాడుతూ.. ఇది సుమారు 6 నుంచి 7 అడుగులతో దాదాపు 200 పౌండ్ల పైన బరువు ఉండచ్చని, ఇది సుమారు 76 మిలియన్ల సంవత్సరాల క్రితందని పరిశోధకులు భావిస్తున్నారు.
ఈ డైనోసర్..తన జాతిలోని మరొక దానితో తలపడి ఉండొచ్చని, అందుకే దాని పుర్రెలో రెండు బలమైన గాయాల గుర్తులు కనిపిస్తున్నాయని వారన్నారు. తవ్వకాల్లో ఇలాంటి జీవి పుర్రె లభించడం అత్యంత అరుదని చెబుతున్నారు. పుర్రె చెక్కు చెదరకుండానే ఉంది కానీ అస్థిపంజరం చాలావరకు చెదలుబట్టిందని పరిశోధకులు పేర్కొన్నారు. మాక్సిమస్ గా పిలవబడే ఈ పుర్రె వేలంలో సుమారు రూ.122 కోట్ల నుంచి రూ.162 వరకు పలుకుతుందని పరిశోధకులు అంచనా వేస్తున్నారు.