ఈ మద్య పలు దేశాల్లో భూకంపాలు ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. నిన్న ఇండోనేషియాలో భూకంపం సృష్టించిన బీభత్సం మరువక ముందే.. మంగళవారం ఉదయం సోలమాన్ దీవుల్లో భారీ భూకంపం సంబవించింది. రిక్టర్ స్కేల్ పై దీని తీవ్రత 7.0 గా నమోదైందని అంటున్నారు. ఈ క్రమంలో సునామీ హెచ్చిరికలు సైతం జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
మంగోలాకు 17 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం నిక్షిప్తమై ఉందని, దాదాపు 20 సెకండ్ల పాటు భూమి కంపించినట్లుగా అధికారులు తెలిపారు. ఈ భూకంపం ప్రభావం వల్ల ఆస్తి, ప్రాణ నష్టానికి సంబంధించిన సమాచారం అందలేదని అధికారులు తెలిపారు. ఉదయం 7.33 ప్రాంతంలో భూకంపం సంబవించినట్లుగా యూఎస్ జియోలాజికల్ సర్వే అధికారులు వెల్లడించారు. అంతేకాదు సోలమాన్ తీర ప్రాంతంలో సునామీ హెచ్చరికలు కూడా జరీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని..మరిన్ని భూ ప్రకంపనలు వచ్చే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో ప్రజలు ఎత్తైన ప్రదేశాలకు వెళ్లాల్సిందిగా అధికారులను కోరారు.
ఇండోనేషియాలో నిన్న భారీ భూకంపం సంబవించింది. పది గంటల వ్యవధిలో 62 సార్లు భూమి కంపించడంతో భారీ ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లింది. పశ్చిమ జువా ప్రావిన్స్ లో సోమవారం సంబవించిన భూకంపం రెక్టర్ స్కేల్ పై 5.6గా నమోదు అయ్యింది. ఈ భూకంపం అక్కడ పదుల సంఖ్యలో ప్రాణాల బలికొంది. దాదాపు 15 సెకన్ల పాటు జువా కంపించడంతో ప్రజలు భయంతో వణికిపోయారు. ఈ భారీ భూకంపం కారణంగా దాదాపు 162 మంది మరణించిట్లు, 700 మందికి పైగా గాయపడ్డారని.. ఇంకా చాలా మంది శిథిలా కిందే ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ భూకంపాన్ని ఇండోనేషియా జాతీయ విపత్తు ప్రకటించింది.