భారత సంతతికి చెందిన రెండేళ్ల చిన్నారి దేవదన్ దేవరాజ్.. స్పైనల్ మస్క్యూలర్ అట్రోఫీ అనే అరుదైన వ్యాధితో బాధపతుడుతున్నాడు. ఈ చిన్నారి విషయంలో సింగపూర్ ప్రజలు మానవత్వాన్ని చాటుకున్నారు. చికిత్సకు అవసరమైన డబ్బును కేవలం పది రోజుల్లోనే సేకరించి తమ ఔదర్యాన్ని చూపారు. వివరాల్లోకి వెళ్తే..
సింగపూర్ లో భారత సంతతికి చెందిన దవేదేవరాజ్, చైనా సంతతికి చెందిన షువెన్ దేవరాజ్ దంపతులకు దేవదన్ అనే బాబు ఉన్నాడు. ఇతను స్పైనల్ మస్క్యూలర్ అట్రోఫీ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడు. స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ వ్యాధి వలన కండరాలు చచ్చుపడిపోతాయి. చికిత్స చేయకపోతే మరణిస్తారు. ఇది జన్యుపరమైన వ్యాధి. పుట్టిన ఏడాది నుంచి నాలుగేళ్లలోపు బయటపడుతుంది. ఈ వ్యాధితో బాధపడుతున్న దేవదన్ ప్రాణాలతో బయట పడాలంటే ఖర్చు రూ.16 కోట్లకు పైనే అవుతుంది. అయితే అంత ఖర్చు భరించే స్థోమత ఈ దంపతులకు లేదు. దీంతో వారు క్రౌడ్ ఫండ్ ప్లాట్ ఫామ్ పై విరాళాలకు పిలుపునిచ్చారు.
దీంతో అందరూ తమకు వీలైనంత విరాళంగా ఇచ్చారు. 30 లక్షల సింగపూర్ డాలర్లు సమకూరాయి. మన కరెన్సీలో రూ.16.68 కోట్లు. ఇది కూడా కేవలం 10 రోజుల్లోనే చికిత్స కోసం కావాల్సినంత సమకూరడం విశేషం. దాంతో జోల్ జెన్ స్మా అనే ఖరీదైన ఇంజెక్షన్ తో దేవదన్ కు నేషనల్ యూనివర్సిటీ హాస్పిటల్ వైద్యులు వైద్యం చేసి.. ప్రాణాలు కాపాడారు. దాంతో వ్యాధి నుంచి అతడు కోలుకున్నాడు. సొంతంగా నడవగలుగుతున్నాడు.
కొడుకు మాములు స్థితికి రావడంపై దేవరాజ్ భావోద్వేగంతో స్పందించారు. ‘ఏడాది క్రితం మా కుమారుడు నడుస్తాడని అనుకోలేదు. అప్పుడు అతడు నిలబడడం కూడా సాధ్యం కాలేదు. ఇప్పుడు నడవడమే కాకుండా, మూడు చక్రాల సైకిల్ ను కొంత మేర నడుపుతున్నాడు. ఇది అద్భుతంగా ఉంది’ అని పేర్కొన్నారు. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.