అండర్ వరల్డ్ డాన్, మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ దావూద్ ఇబ్రహీం గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఇతడు తరుచూ ఏదో ఒక విషయంతో వార్తల్లో నిలుస్తుంటాడు. తాజాగా రెండో పెళ్లి చేసుకుని వార్తలో నిలిచాడు. పాకిస్థాన్ కు చెందిన ఓ మహిళను రెండో వివాహం చేసుకున్నాడు. ఈ విషయాన్ని అతని మేనల్లుడు అలీషాహే స్వయంగా వెల్లడించాడు. అంతేకాక దావూద్ ఇబ్రహీంపై అలీషాహ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మొదటి భార్య ఉండగానే.. అబద్ధం చెప్పి మరో మహిళను పెళ్లి చేసుకున్నట్లు అతడు పేర్కొన్నాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
దావూద్ ఇబ్రహీం సోదరి హసీనా పార్కర్ కుమారుడు అలీషాహే.. తన మేనమామ దావూద్ ఇబ్రహీం గురించి ఎన్ఐఏ అధికారుతో విస్తుతపోయే నిజాలు వెల్లడించాడు. దావూద్ పాకిస్థానీ మహిళను రెండో పెళ్లి చేసుకున్నాడని, అతడు పెళ్లి చేసుకున్న మహిళ పాకిస్థానీ పఠాన్ ల కుటుంబానికి చెందిన వారని అలీషాహ్ తెలిపాడు. అయితే ఆమెను ఎప్పుడు వివాహం చేసుకున్నాడనే విషయం మాత్రం చెప్పలేదు. దావుడ్ ఇప్పుడు పాకిస్థాన్ లోని కరాచీలో డిఫెన్స్ ఏరియాలో ఉంటున్నాడు. ఈ విషయాలను అలిషా ఇబ్రహీం పార్కర్ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ దర్యాప్తులో భాగంగా బయటపెట్టాడు.
ఉగ్రవాదులకు నిధులు సేకరించిన కేసులో భాగంగా దావూద్ ఇబ్రహీంపై ఎన్ఐఏ గతంలో కేసులు నమోదు చేసింది. ఈ క్రమంలో అతడితో సంబంధం ఉన్న పలువురిని ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు. వారిలో దావూద్ మేనల్లుడు అలీషాహ్ పార్కర్ కూడా ఉన్నాడు. అతడి స్టేట్ మెంట్స్ ను రికార్డు చేసిన అధికారులు.. టెర్రర్ ఫండింగ్ కేసులో ఛార్జ్షీట్ను దాఖలు చేశారుమీడియా కథనం ప్రకారం.. మొదటి భార్య మైజాబిన్ తో విడాకులు తీసుకున్నట్టు దావూద్ ఇబ్రహీం అందరిని నమ్మించాడు. కానీ.. వాస్తవంగా అది జరగలేదు. మొదటి భార్యతో ఉండగానే.. అతను పాకిస్థాన్ మహిళను రెండో పెళ్లి చేసుకున్నాడు. అదే సమయంలో దావూద్ ఇబ్రహీం నివాసాన్ని కూడా మార్చుకున్నాడు. దావూద్ రెండవ పెళ్లి అనేది.. అతడి మొదటి భార్య మెహజబీన్ దర్యాప్తు సంస్థల దృష్టి నుంచి మరల్చడానికి చేసిన ప్రయత్నం కూడా కావచ్చని అధికారులు భావిస్తున్నారు.
2022 వసంవత్సరం జులై నెలలో మెహజబీన్ ను దుబాయ్లో కలిశానని, దావూద్ రెండో వివాహం గురించి ఆమె తనకు చెప్పిందని అలీ షా చెప్పారు. మెహజబీన్ షేక్ వాట్సాప్ కాల్స్ ద్వారా ఇండియాలోని దావూద్ కుటుంబ సభ్యులతో సంబంధాలు కొనసాగిస్తున్నారని అలీషాహ్ పేర్కొన్నాడు. ప్రస్తుతం అతను కరాచీలో అబ్దుల్లా ఘాజి బాబా దర్గాకు సమీపంలోని పాక్ రక్షణమంత్రిత్వశాఖ పరిధిలో ఉన్న ప్రాంతంలో నివాసముంటున్నాడు. అయితే దావూద్ ఎక్కువగా ఎవరితోనూ మాట్లాడట్లేదని, అందరికీ దూరంగా ఉంటున్నాడని అలీషాహ్ తెలిపాడు. మరి.. దావూద్ మేనల్లుడు.. ఎన్ఐఏ అధికారులకు తెలిపిన విషయాల్లో వాస్తవం ఎంతనేది మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.