ప్రపంచ వ్యాప్తంగా బంగారం, వజ్రాలకు ఎంతో విలువ ఉంటుంది. ముఖ్యంగా భూమిపై అరుదుగా లభించే విలువైన వాటిల్లో వజ్రం కూడా ఒకటి. భూమిలో ప్రత్యేక పరిస్థితుల్లో కర్భన సమ్మేళనాల కలయిక ద్వారా వజ్రాలు ఏర్పడతాయి. మనం పింక్, నీలి వజ్రం, ఆకుపచ్చ వజ్రాలను చూసి ఉంటాం. చాలా అరుదుగా నలుపు వజ్రం కనిపిస్తుంది. నక్షత్రమండలం నుంచి ఊడిపడిన అలాంటి ఓ అరుదైన నలుపు వజ్రాన్ని లండన్ లోని సోతెబీ అనే సంస్థ వేలం వేయనుంది.
ఈ వజ్రాలను ఎనిగ్మా అని పిలుస్తారు. 555.55 క్యారెట్ల బరువైన ఈ వజ్రం 55 ముఖాలను కలిగి ఉంది. 260 కోట్ల ఏళ్ల క్రితం భూమిని ఓ పెద్ద ఉల్క లేదా గ్రహ శకలం భూమిని ఢీకొట్టినప్పుడు ఈ వజ్రం ఏర్పడి ఉంటుందని సోతెబీ వేలం సంస్థ జ్యువెలరీ స్పెషలిస్ట్ సోఫీ స్టీవెన్స్ చెప్పారు. సహజసిద్ధంగా నలుపు రంగులో వచ్చిన ఇలాంటి వజ్రం చాలా అరుదు. వాటి ఉద్భవం ఇప్పటికీ మిస్టరీనే అని సోతెబీ చెప్పింది. శక్తి, రక్షణకు చిహ్నమైన మిడిల్ ఈస్ట్ పామ్ ఆకారంలోనే దీనిని రూపొందించారు. 20 ఏళ్ల క్రితం వరకు కూడా ఆ వజ్రాన్ని బయటకు తీసుకురాలేదని తెలిపింది. కాగా, అతిపెద్ద అరుదైన నలుపు వజ్రంగా 2006లో దీనికి గిన్నిస్ రికార్డు కూడా ఉందని సోతెబీ వెల్లడించింది.
ఇది చదవండి : అవి వాడొద్దు..! వైద్యులను ఆదేశించిన రాష్ట్ర ప్రభుత్వం
కార్బోనాడోగా పిలవబడే ఈ నల్లని వజ్రాలు బ్రెజిల్, ఆఫ్రికాలో మాత్రమే అరుదుగా దొరుకుతుంటాయి.. ఆ వజ్రాన్ని తొలిసారిగా దుబాయ్ లో ప్రజల సందర్శనార్థం ఉంచారు. ఫిబ్రవరి 3న ఆన్ లైన్ లో వేలం నిర్వహించనున్నారు. ఇదో అంతరిక్ష అద్భుతం అని సోతెబీ పేర్కొంటోంది. వేలంలో ఈ వజ్రానికి కనీసం 50 లక్షల డాలర్లు వస్తాయని అంచనా వేస్తున్నారు. ఈ వజ్రాన్ని ఎవరు సొంతం చేసుకోనున్నారో, ఎంత ధరకి కొనుగోలు చేయనున్నారో అనే విషయాలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.