దక్షిణాఫ్రికాలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ తొలి కేసు నమోదు కాగా.. ఇప్పటివరకు దాదాపు 100 దేశాలకు వ్యాప్తి చెందింది. ప్రపంచ దేశాల్లో వేగంగా విస్తరించిన ఒమిక్రాన్ వేరియంట్ ఇప్పుడు ప్రాణాలు తీయడం మొదలుపెట్టింది. యూకేలో ఒమిక్రాన్ మరణం సంభవించింది. ఈ విషయాన్ని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ కూడా ధృవీకరించిన విషయం తెలిసిందే. తాజాగా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కారణంగా మొదటి మరణం అమెరికాలో నమోదైంది.
టెక్సాస్లోని హారిస్ కౌంటిలో ఓ వ్యక్తి మరణించినట్లు కౌంటీ ఆరోగ్యశాఖ పేర్కొంది. ఆ వ్యక్తి ఇప్పటి వరకు టీకా తీసుకోలేదని, అతని వయసు 50 నుంచి 60 సంవత్సరాల మధ్య ఉంటుందని అమెరికా మీడియా వెల్లడించింది. ఇప్పటికే రెండు సార్లు కొవిడ్ బారినపడ్డట్లు అధికారులు పేర్కొన్నారు. మరో వైపు ఒమిక్రాన్ వేరియంట్ అమెరికాలో విజృంభిస్తున్నది. 20 రోజుల కింద అమెరికాలో ఒమిక్రాన్ ఫస్ట్ కేసు నమోదైంది. ఆ తర్వాత క్రమంగా కేసుల సంఖ్య పెరిగింది. ఈ నెల 18తో పూర్తయిన వీక్లీ సీక్వెన్సింగ్ డేటా ఆధారంగా అమెరికాలో కరోనా కేసుల్లో 73శాతం ఒమిక్రాన్ వేరియంటే కారణమని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ పేర్కొంది.
ఇదీ చదవండి : ఈ యాప్ వెంటనే తొలగించండి! ఆండ్రాయిడ్ యూజర్లకు ప్లే స్టోర్ హెచ్చరిక!
ఇక అగ్రరాజ్యంలోని మొత్తం 48 రాష్ట్రాల్లో ఒమిక్రాన్ వేరియంట్ గుర్తించారు. ప్రపంచమంతా ఇటీవల కరోనా అదుపులో ఉన్నా… అమెరికాలో కంట్రోల్లో లేదు. రోజూ లక్షకుపైనే కేసులు వస్తున్నాయి. అమెరికాలో బూస్టర్ డోసు ఇస్తున్నప్పటికీ కేసులు భారీగా నమోదవడానికి కూడా అనేక కారణాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. ఇదిలా ఉంటే.. అగ్రరాజ్యంలో నుంచి వచ్చే ప్రయాణికులతో ఇతర దేశాల్లో ఆందోళన మొదలైంది. ఆయా దేశాల్లో అమెరికా నుంచి వచ్చిన వారితో ఒమిక్రాన్ ప్రభలే అవకాశం ఉండటంతో టెన్షన్ పడుతున్నారు.