‘గినియా’దేశంలో మార్బర్గ్ వ్యాధికి సంబంధించి ఒక కేసు నమోదయ్యింది. ఈ విషయాన్ని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పడం జరిగింది. అయితే ఎబోలోకి సంబంధించిన ప్రాణాంతక వైరస్ మొదటిసారిగా గుర్తించడం జరిగింది. అయితే ఇది కోవిడ్ 19 లాగ వ్యాపిస్తుందని కూడా చెప్తున్నారు. ఆఫ్రికాలోని పశ్చిమ ప్రాంతం గినియా దేశంలో ప్రాణాంతకమైన మార్బర్గ్ వైరస్ బారినపడి ఓ వ్యక్తి మరణించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) వెల్లడించింది.
ఆగస్టు 2న గినియా దేశంలోని గుక్కెడో ప్రిఫెక్చర్లో మరణించిన రోగి నుంచి సేకరించిన నమూనాలలో ఈ ప్రాణాంతక వైరస్ కనుగొన్నట్లు ఇది జంతువుల నుండి మనుషులకు కూడా వ్యాపిస్తుంది అని వెల్లడించారు. 88 శాతం వరకూ మరణాల రేటు ఉంది అని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పింది. లోకల్ క్లినిక్ లో ట్రీట్మెంట్ తీసుకున్నాక మలేరియా ఉందని వైద్యులు గుర్తించారు. ఆ తర్వాత ఆ వ్యక్తి మరణించాడు.
పోస్టుమార్టం రిపోర్ట్ లో అయితే ఎబోలా నెగిటివ్ చూపించింది కానీ మార్బర్గ్ పాజిటివ్ వచ్చింది. కుటుంబ సభ్యులు మరియు తోటి ఉద్యోగస్తుల పైన కాస్త రిస్క్ ఎక్కువగా ఉందని ఆ వ్యక్తికి దగ్గరగా ఉన్న వాళ్ళని కూడా వైద్యులు చూస్తున్నారని చెబుతున్నారు. మొదట హై ఫీవర్ తో ఈ వ్యాధి మొదలవుతుంది. తీవ్రమైన తలనొప్పి, చికాకు ఉంటుంది.
ఇప్పటికీ ఇంకా ఎటువంటి వాక్సిన్ యాంటీవైరల్ ట్రీట్మెంట్స్ లేవు అని అంటు న్నారు. మార్బర్గ్ వైరస్ ప్రమాదకరమని ఇది చాలా దూరం వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున మొదట్లోనే నిలువరించాలని ఆఫ్రికా డబ్ల్యూహెచ్ఓ రీజినల్ డైరెక్టర్ డాక్టర్ మత్షిడిసో మోయిటి పేర్కొన్నారు. ఒకసారి ఈ వైరస్ కనుక సోకితే ఆ తర్వాత ఇది మరొకరికి బాడీ ఫ్లూయిడ్స్ ద్వారా సోకుతుంది అని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెబుతోంది.