గత కొంత కాలంగా ప్రపంచ వ్యాప్తంగా ఉగ్రవాదులు పలు విధ్వంసాలతో రెచ్చిపోతున్నారు. వందల సంఖ్యలో అమాయక ప్రజల ప్రాణాలు బలితీసుకుంటున్నారు. ఆఫ్గానిస్తాన్ ఎప్పుడైతే తాలిబన్ల చేతికిపోయిందో.. అప్పటి నుంచి బాంబుల మోత మోగుతూనే ఉంది. కొన్ని ఉగ్రవాద సంస్థలు పౌరులను లక్ష్యంగా చేసుకొని ఆత్మహుతి దాడులకు పాల్పపడుతున్నారు. తాజాగా ఓ మదర్సాలో పిల్లలు, సామాన్య పౌరులు లక్ష్యంగా చేసుకొని బాంబు దాడి జరిగింది.. ఈ దాడిలో 19 మంది చనిపోయారు. వివరాల్లోకి వెళితే..
ఆఫ్గానిస్తాన్ ఐబాక్ నగరంలో ఒక మదార్సాలో బుధవారం సాయంత్రం భారీ పేలుడు సంబవించింది. ఈ బాంబు పేలుడులో 19 మంది చనిపోగా.. 24 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో ఎక్కువ మంది చిన్న పిల్లలు, సామాన్యులు ఉన్నట్లు తెలుస్తుంది. ఈ దాడిలో పలువురు తీవ్రంగా గాయపడ్డారని అందులో కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఉత్తర ఆఫ్గానిస్తాన్ ప్రాంతంలో అల్ జిహాద్ మదార్సాలో బాంబు పేలుడు సంబవించిందని తాలిబన్ అధికారి తెలిపారు.
ఇస్లామిక్ మత పాఠశాల అయిన మదర్సాలో బాంబ్ బ్లాస్ జరిగినట్టు ఆఫ్గానిస్తాన్ అంతర్గత వ్యవహారాల శాఖామంత్రి అబ్దుల్ నఫీ టాకోర్ నిర్ధారించారు. ఇప్పటి వరకు ఏ ఉగ్రవాద సంస్థ ఈ దాడికి పాల్పపడినట్టు ప్రకటించారు. అయితే బాంబు దాడికి పాల్పడిన వారిని గుర్తించే పనిలో ఉన్నట్లు అబ్దుల్ నఫీ టాకోర్ తెలిపారు. గత ఏడాది నుంచి ఆఫ్గానిస్తాన్ ని తాలిబన్లు ఆక్రమించుకొని పరిపాలన కొనసాగిస్తున్నారు.
ఆఫ్గానిస్తాన్ ప్రజలను లక్ష్యంగా చేసుకొని కొన్ని ఉగ్రవాద సంస్థలు మసీదులు, మదర్సాలు లక్ష్యంగా చేసుకొని చిన్నా.. పెద్దా అనే తేడా లేకుండా బాంబు దాడులకు పాల్పపడుతున్నారు. ఈ దాడులో ఎంతోమంది అమాయక ప్రజలు చనిపోతున్నట్లు అధికారులు తెలిపారు. ఈ క్రమంలో ప్రజల భద్రతపై దృష్టి సారిస్తున్నట్లు అధికారులు చెప్పారు.