అడాల్ఫ్ హిట్లర్ తర్వాత నియంతగా మళ్లీ అంతటి పేరు సాధించిన వ్యక్తి ఉత్తర కొరియా దేశాధినేత కిమ్ జోంగ్ ఉన్. ఎప్పుడూ ఆయన నిర్ణయాలు, ఆదేశాలతో దేశ ప్రజలను ముప్పు తిప్పలు పెడుతుంటాడు. ఆ నిషేదాలు, ఆజ్ఞలు చూస్తే ముక్కున వేలేసుకోక మానరు. ఇప్పుడు మళ్లీ అలాంటి ఆదేశాలే జారీ చేశాడు కిమ్. పదకొండు రోజుల పాటు ఆ దేశంలో ఎవ్వరూ నవ్వకూడదు, మద్యం సేవించ కూడదు అంటూ ఆదేశాలు జారీ చేశాడు. ఆయన తండ్రి పదో వర్ధంతి సందర్భంగా ఇలా సంతాప దినాలు ప్రకటించాడు.
I wish someone will tickle Kim Jong Un to death 😂😂😂😡😡😡 pic.twitter.com/1KlxQYvXyq
— Ram Gopal Varma (@RGVzoomin) December 17, 2021
అంతేకాదు.. ఈ పదిరోజుల్లో ఎవరి బర్త్ డేలు ఉన్నా సెలబ్రేట్ చేసుకోకూడదు. ఎవరి ఇంట్లో అయిన కుటుంబ సభ్యులు మరణించినా కూడా ఏడవకూడాదని ఆర్డర్ పాస్ చేశారు. మరీ ఇంత దారుణమైన ఆదేశాలు ఏంటి అంటూ ప్రపంచ దేశాలు కిమ్ జోంగ్ ఉన్ నిర్ణయాన్ని తప్పుబడుతున్నాయి. ఇంకా ఇలాంటి ఎన్ని దారుణైన నిర్ణయాలు చూడాల్సి వస్తుందో అని ఆ దేశ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కిమ్ జోంగ్ ఉన్ కు ఇలాంటి నియంత ధోరణి ఊరికే రాలేదు లెండి. ఆయన తండ్రి కిమ్ జోంగ్ కూడా ఇలాగే దేశ ప్రజలను నానా తిప్పలు పెట్టేవాడు.
ఉత్తర కొరియాని 1994 నుంచి 2011 వరకు 17 ఏళ్ల పాటు ఆ దేశాన్ని అణిచి వేశాడు. 2011 డిసెంబరు 17న కిమ్ జోంగ్ గుండెపోటుతో మరణించాడు. ఆ తర్వాత ఆ స్థానంలో కిమ్ జోంగ్ ఉన్ దేశాధినేతగా మారి.. ఆయన తండ్రి లేని లోటును తీరుస్తున్నాడు. కిమ్ జోంగ్ ఉన్న తీసుకున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.