అదృష్టం కలిసి వస్తే రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయిన వారు ఎంతో మంది ఉన్నారు. మనిషి జీవితంలో ఎప్పుడు ఏం అవుతాడో ఎవరు చెప్పలేరు. ఇది అక్షరాల నిజం ఎందుకంటే.. అప్పటి వరకు ధనవంతుడిగా ఉన్న వ్యక్తి పేదవాడు కావొచ్చు.. కటిక పేదరికం అనుభవించిన వాడు ధనవంతుడు కావొచ్చు. చివరికి ఏదైనా అదృష్టంపైనే ఆధారపడుతుందని చెబుతారు. కొంత మందికి తమ వారసత్వపు ఆస్తులు కలిసి వస్తే.. మరికొంత మందికి లంకెబిందల రూపంలో కలిసి వస్తుంది. అయితే ప్రపంచ వ్యాప్తంగా చాలా మందికి తాము కొన్న లాటరీ ద్వారా కోట్లు కలిసి వచ్చిన వారు ఉన్నారు.
దుబాయ్ లో ఎలక్ట్రీషియన్ గా పనిచేస్తున్న మహ్మద్ సమీర్ కి మంచి అదృష్టం కలిసి వచ్చింది. అతడు కొనుగోలు చేసిన లాటరీ టికెట్ ఏకంగా రూ. 24.80 కోట్లు గెలుచుకుంది. ఉత్తర్ ప్రదేశ్ కి చెందిన మహ్మద్ సమీర్ అతడు తన ఆరుగురు స్నేహితులతో కలిసి 1000 దిర్హామ్స్ వెచ్చించి లాటరీ టికెట్ కొనుగోలు చేశాడు. ఇందులో సమీర్ ఒక్కడే 500 దిర్హామ్స్ చెల్లించాడు. దీంతో అతనికి రూ.12.40 కోట్లు కలిసి వచ్చాయి. తనకు ఇంత అదృష్టం కలిసి వచ్చినందుకు మహ్మద్ సమీర్ తో పాటు కుటుంబ సభ్యులు తెగ ఆనందంలో మునిగిపోయారు.