రష్యా, ఉక్రెయిన్ ల మధ్య గత కొన్ని రోజులు గా భీకర యుద్ధం కొనసాగుతోంది. ప్రపంచ దేశాలు యుద్ధం ఆపని చెప్పినా, బతిమాలినా, ఆఖరికి ఆంక్షలు విధించినా.. రష్యా పట్టించుకోవడం లేదు. ఉక్రెయిన్ను తమ ఆధీనంలోకి తెచ్చుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. నిజానికి యుద్ధం రష్యా పౌరులు సైనికులకు కూడా ఇష్టం లేదు. బలవంతంగా తమను యుద్దంలోకి పంపిస్తున్నారని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు సైనికులు. మరోవైపు చాలా మంది ఉద్యోగులు రష్యా అధ్యక్షుడు పుతిన్ నిర్ణయాన్ని ఖండిస్తూ ఉద్యోగాలకు కూడా రాజీనామా చేశారు.
అయితే యుద్దం గురించి ఎవరి మాట వినని పుతిన్.. ఓ వ్యక్తి మాత్రం యుద్ధం వద్దు అంటే వింటారు అనే వార్తలు వస్తున్నాయి. ఆయన మరెవరో కాదు. చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్. పుతిన్ మనసును మార్చగలిగేది ఆయనొక్కరే అని ప్రముఖ ఆర్థికవేత్త స్టీఫెన్ రోచ్ అంటున్నారు. ఓవైపు యుద్ధం జరుగుతుండగానే శాంతి చర్చలు జరిగినప్పటికి.. అవి విఫలం అవుతున్నాయి. దీంతో ఇలాంటి టైమ్లో మొండిగా ఉన్న పుతిన్ను శాంతింపజేసే వ్యక్తి కేవలం జింగ్పింగ్ మాత్రమే అని అంటున్నారు.రష్యాతో చైనాకు ఉన్న ఫ్రెండ్షిప్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవడం లేదని చైనా విదేశాంగ శాఖ ఇప్పటికే వెల్లడించింది. అంతేగాక.. రష్యాపై ప్రపంచ దేశాల ఆంక్షలను చైనా ఖండిస్తూ వస్తోంది. ఇలా చేయడం కరెక్ట్ కాదని.. రష్యా దీని వల్ల చాలా నష్టపోతుంది అని అంటున్నారు. ఏదేమైనప్పటికి.. చైనా అధ్యక్షుడు జిన్పింగ్ కనుక జోక్యం చేసుకుని యుద్ధం ఆపితే బాగుండు అనుకుంటున్నాయి ఇతర దేశాలు. మరి.. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.