నేటి కాలం జనాల్లో స్మార్ట్ ఫోన్ వాడకం ఎక్కువైయింది. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా నిత్యం మొబైల్స్ ను వాడేస్తున్నారు. జీవన చక్రంలో తిండి, నీరు, నిద్రతో పాటు ఫోన్ కూడా భాగమైయింది. ముఖ్యంగా చదువు కోవాల్సిన పిల్లలు సైతం స్మార్ట్ ఫోన్ కి అడక్ట్ అవుతున్నారు. పుస్తకం ఉండాల్సిన చేతిలో ఫోన్ ఉంటుంది. నిత్యం మొబైల్ లో గేమ్స్ ఆడుతూ.. చదువును నిర్లక్ష్యం చేస్తున్నారు. కొందరు పిల్లల ఆన్ లైన్ గేమ్స్ ఆడుతూ.. లక్షలు పోగొట్టిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఇక్కడ ఓ పిల్లవాడు మాత్రం గేమ్ ఆడుతుండగా మధ్యలో వచ్చిన ఫుడ్ ఆర్డర్ యాప్ ని తెలియక క్లిక్ చేయడటంతో డబ్బులు పొగొట్టుకున్నాడు. ఈ సంఘటన ఆస్ట్రేలియాలో జరిగింది.
ఆస్ట్రేలియాలోని సిడ్నీకీ చెందిన ఐదేళ్ల బాలుడు టెట్రీస్ అనే గేమ్ ఆడుతుండగా.. ఆ గేమ్ కాస్తా అనుకోకుండా’ఉబర్ ఈట్స్’ లోకి వెళ్లింది. అనంతరం అందులో నోరూరించే ఐస్ క్రీమ్ లు బాలుడి కంటపడ్డాయి. అంతే ఆలస్యం చేయకుండా తండ్రి క్రెడిట్ కార్డు నుంచి ఆర్డర్ పెట్టేశాడు. ఈ ఆర్డర్ లో ఖరీదైన మెస్సినా ఐస్ క్రీమ్ లు కూడా ఉన్నాయి. వీటి బిల్లు మెసేజ్ ఆ బాలుడు తండ్రి వెళ్లడంతో అతను ఒక్కసారి షాక్ కి గురయ్యాడు. పుడ్ ఆర్డర్ చేసిన ఆ బాలుడు, చిరునామాగా తన తండ్రి ఆఫీస్ నే ఇవ్వడం గమనార్హం. ఆ బాలుడు మొత్తంగా దాదాపు లక్ష రూపాయాలకు ఫుడ్ ఆర్డర్ చేసి.. తండ్రికి గుండెలదిరేలా చేశాడు. ఈ విషయాన్ని మెస్సినానే సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీనిపై నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. ఈ సంఘటనపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.