న్యూ ఢిల్లీ- భారత్ లో నెంబర్ వన్ ముఖ్యమంత్రి ఎవరు.. ఎవరి పనితీరు బావుంది.. ఏ ముఖ్యమంత్రి ఓట్లు వేసిన ప్రజలు సంతృప్తిగా ఉన్నాయి.. ఇటువంటి అంశాలపై ఇండియా టుడే నిర్వహించిన మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. ఈ సర్వేలో రాష్ట్రాల వారిగా ముఖ్యమంత్రిల పనితీరుపై ప్రజల అభిప్రాయాలను సేకరించింది ఇండియా టుడే. ఐతే ఈ సర్వే ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాత్రం బాగా వెనుకబడి పోయారు.
ఇక దేశంలోనే తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అందరికంటే ముందు వరుసలో ఉన్నారు. స్టాలిన్ పాలన అద్భుతంగా ఉందంటూ 42 శాతం మంది తమిళనాడు ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేశారు. అటు 38 శాతంతో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ రెండో స్థానంలో ఉండగా, 35 శాతంతో కేరళ సీఎం పినరయి విజయన్ మూడు స్థానాల్లో ఉన్నారు. ఆ తర్వాత 30 శాతంతో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ నాలుగవ స్థానంలో , 29 శాతంతో అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఐదవ స్థానంలో ఉన్నారు.
ఇక 29 శాతంతో ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అరవ స్థానంలో, 22 శాతంతో రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ ఏడవస్థానంలో ఉన్నారు. మరోవైపు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ 22 శాతంతో ఎనిమిదవ స్థానంలో ఉండగా, 19 శాతంతో ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ 9వ స్థానంలో ఉన్నారు. 19 శాతంతో చత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ భగేల్ 10వ స్థానంలో నిలిచారు. మొదటి 10 స్థానాల్లో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, వైఎస్ జగన్ ఎవ్వరు రాలేదు.
ప్రధానంగా గత సంవత్సరం దేశంలోనే అత్యుత్తమ ముఖ్యమంత్రిగా వెలుగొందిన ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి ఈ యేడాది వెనుక వరకు వెళ్లిపోయారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో జగన్కు భారీ విజయాన్ని కట్టబెట్టిన ఏపీ ప్రజలు ఇప్పుడు ఆయనపై పూర్తి వ్యతిరేకంగా ఉన్నట్టు ఇండియా టుడే సర్వేలో తేలింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 81 శాతం మంది సీఎం వైఎస్ జగన్ పరి పాలనపై అసంతృప్తిగా ఉన్నట్టు సర్వే తేటతెల్లం అయ్యింది. గత సంవత్సరంతో పోలిస్తే రాష్ట్రంలో సగం మంది మాత్రమే జగన్కు అనుకూలంగా ఓటేశారు.ఇక ప్రధాని నరేంద్ర మోదీ రేటింగ్స్ కూడా గత యేడాదితో పోలిస్తే బాగా పడిపోయాయి.
Netas, performance & more!
Watch #MoodOfTheNation, the ultimate national report card, with @sardesairajdeep & @rahulkanwalhttps://t.co/yGHyBqdxUE pic.twitter.com/2c2XIIOXFk— IndiaToday (@IndiaToday) August 17, 2021