స్పోర్ట్స్ డెస్క్- క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పురుషుల టీ-20 వరల్డ్ కప్ కు సంబందించి ఐసీసీ కీలక ప్రకటన చేసింది. ఆస్ట్రేలియా వేదికగా ఈ ఏడాది చివర్లో జరగనున్న పురుషుల టీ20 వరల్డ్ కప్ కు సంబందించిన షెడ్యూల్ జనవరి 21న వెల్లడించనున్నట్లు ఐసీసీ పేర్కొంది. టిక్కెట్ల అమ్మకం ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభమవుతుందని ఐసీసీ స్పష్టం చేసింది.
ఈ మేరకు ఐసీసీ ట్విటర్లో ఓ వీడియోను పోస్ట్ చేసింది. మొత్తం 12 జట్లు పాల్గొనే ఈ మెగా టోర్నీ అక్టోబర్ 13, నవంబర్ 16 మధ్యలో జరగనున్నట్లు సమాచారం. గత సంవత్సరం టీ-20 ప్రపంచ కప్ దుబాయ్ వేదికగా జరిగిన సంగతి తెలిసిందే. ఫించ్ నేతృత్వంలో ఆసీస్ జట్టు తొలిసారి టీ-20 ప్రపంచ కప్ను కైవసం చేసుకుంది.
టీ-20 ర్యాంకింగ్స్లో గత యేడాది చివరి నాటికి టాప్ 8లో ఉన్న జట్లు ప్రపంచ కప్-2022కు నేరుగా అర్హత సాధించాయి. మిగతా నాలుగు స్థానాల కోసం క్వాలిఫైయర్ మ్యాచ్లు నిర్వహిస్తారు. భారత్, పాకిస్థాన్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, ఆఫ్ఘనిస్థాన్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లండ్ జట్లు ఇదివరకే ప్రపంచకప్కు అర్హత సాధించాయి. శ్రీలంక, వెస్టిండీస్, నమీబియా, స్కాట్లాండ్ జట్లు క్వాలిఫైయర్స్లో పోటీ పడనున్నాయి.
🗓 21.01.2022
The ICC Men’s T20 World Cup Australia 2022 fixture is coming! #T20WorldCup pic.twitter.com/9Z2ASZgaty— T20 World Cup (@T20WorldCup) January 14, 2022