ప్రభుత్వ ఉద్యోగం కోసం యువత ఎంతో కృషి చేస్తూ ఉంటారు . ర్యాంకు లో విజయం సాధించిన వారంతా ఐఏఎస్ కోసం కలలు కంటుంటారు .అయితే కన్నా కలలు నెరవేరాలంటే ఎంతో బాగా కృషి చేయాలి .. శ్రమించాలి . ఐఏఎస్ అంటే ఇక మరి చెప్పనక్కర్లేదు. వందల్లో ఉండే పోస్టులకు ఏటా లక్షల్లో అప్లై చేస్తుంటారు. అంతలా కృషిచేసినా కొందరు మాత్రమే ఉద్యోగం సాధిస్తారు. ఎన్నో లక్షల మంది ప్రయత్నం చేస్తారు కానీ కొందరిని మాత్రమే విజయం వరిస్తుంది. యుక్తవయసులో ఉండే సరదాలు స్నేహితులతో కబుర్లు అవన్నీ పక్కన పెడతారు . విజయం కోసం వారి ధ్యాస అంతా తమ ధ్యేయం మీదనే ఉంచి నిరంతరం చదువుతూనే గడుపుతారు .
విజయం సాధించటం కోసం కొందరు అందరిలా కాకుండా కొంచెం భిన్నంగా ప్రయత్నిస్తారు. తను ఎంచుకున్న రీతిలో పట్టు సాధించిన వారే హరియాణ గురుగ్రామ్కు చెందిన ఐఏఎస్ అధికారి నిధి సివాచ్. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని కలలు కనే ప్రతి ఒక్కరికి ఆమె విజయ గాధ మార్గదర్శకంగా ప్రేరణగా నిలుస్తుంది. ఆమె గురించి ఒకసారి తెలుసుకుందాం .. గురుగ్రామ్కు చెందిన నిధి సివాచ్ చదువులో ఎప్పుడు మొదటి స్థానం .పదో తరగతి, ఇంటర్మీడియెట్లో 95, 90 శాతం మార్కులు సాధించారు. హరియాణ సోనిపాట్లోని దీనబంధు ఛోటురామ్ యూనివర్శిటీ నుంచి మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు.
చదువు పూర్తయిన వెంటనే నిధికి హైదరాబాద్ టెక్ మహీంద్రాలో డిజైన్ ఇంజనీర్గా ఉద్యోగం వచ్చింది. కొన్ని సంవత్సరాలు జాబ్ చేసినప్పటికి ఆమెకు సంతృప్తి చెందలేదు . ఆమె ఐఏఎస్ కావాలని ధ్యేయంగా పెట్టుకున్నారు . ఆ ప్రయత్నం లో 2017లో ఉద్యోగానికి కు రాజీనామా చేసి.. యుపిఎస్సి కి చదవడం ప్రారంభించారు. ఇంగ్లీష్ మీడియంలో పరీక్ష రాయాలని భావించారు నిధి. ఆప్షనల్ సబ్జెక్ట్గా చరిత్రను ఎంచుకున్నారు. తాను తొమ్మిది, పదో తరగతిలో చదివని సిలబస్ యూపీఎస్సీ ప్రిపరేషన్కు ఎంతో ఉపయోగపడుతుందని భావించి.. చరిత్రను ఆప్షనల్ సబ్జెక్ట్గా ఎంచుకున్నారు నిధి. చాలా పట్టుదలతో చదివారు.
కానీ మొదటి రెండు ప్రయత్నాల్లో విజయం సాధించలేకపోయారు నిధి. ఓటమి ఆమెలో మరింత పట్టుదల పెంచింది. ఈసారి ఎలాగైనా తప్పకుండా ఉద్యోగం సాధించాలని బలంగా నిర్ణయించుకున్నారు. దానికోసం నిధి పెద్ద సాహసమే చేశారని చెప్పవచ్చు. మూడో సారి తన ప్రిపేరషన్ పంథాను పూర్తిగా మార్చేశారు నిధి. తనను తాను 6 నెలల పాటు గదిలోనే ఉండిపోయారు ..అదే విద్యాలయం ..చదువు తప్ప వేరే దేని మీదకు తన ధ్యాస మళ్లకుండా రూమ్కే పరిమితయ్యారు. కుటుంబ సభ్యులు ఆమెకు ఎంతో సహకరించారు , ఆమెకు సమయానికి కావాల్సిన ఆహారం, ఇతర వస్తువులు అందింఛి ప్రోత్సహించేవారు.
అలా ఆరు నెలల పాటు రూమ్కే అంకిత భావంతో చదివింది. ఆమె ధ్యేయం ముందు ఓటమి పారిపోయింది. ఈసారి ఏకంగా ఆల్ ఇండియా లెవల్లో 87వ ర్యాంకుతో విజయం సాధించారు నిధి. కల సాకారమై ప్రస్తుతం ఆమె గుజరాత్లో ఐఏఎస్ అధికారిగా విధులు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ ఉన్నత ఉద్యోగం కోసం ఆమె చేసిన ప్రయత్నం ఎందరికో మార్గదర్శకంగా నిలుస్తుంది. మరెందరికో స్ఫూర్తిదాయకమై విజయపథం లో నడిపిస్తుంది .