టీ20 వరల్డ్ కప్ 2021లో గత నెల 24న పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా ఓడిపోయింది. దీంతో ఇండియన్ క్రికెటర్లు, ఫ్యాన్స్ తీవ్ర నిరాశచెందారు. సోషల్ మీడియాలో టీమిండియా ఆటగాళ్ల ప్రదర్శనపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో కోహ్లీ కూతురిపై కొందరు అసభ్యకరమైన కామెంట్లు చేశారు. ‘విరాట్.. నీ కూతురి మొఖం చూపించూ తనను అత్యాచరం చేస్తాం’ అంటూ అభ్యతరకరమైన రీతిలో కామెంట్లు చేశారు. ఈ విషయంలో కోహ్లీకి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కూడా మద్దతుగా నిలిచారు.
ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకున్న పోలీసులు నిందితుడిని పట్టుకునే పనిలో పడ్డారు. ఎట్టకేలకు హైదరాబాద్కు చెందిన రామ్నగేష్ అనే వ్యక్తి కోహ్లీ కూతురి గురించి అసభ్య కామెంట్లు చేసినట్లు నిర్ధారించి అతన్ని బుధవారం అరెస్ట్ చేసి.. ముంబై తరలించారు. అతన్ని విచారించి.. మద్దలించి వదిలేస్తారా? లేక జైలుకు తరలిస్తారా అనే విషయం తెలియాల్సి ఉంది. ఈ అరెస్ట్పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.