అమరావతి- ఓ వైపు చలి వణికిస్తోంటే.. అందులో భారీ వర్ష సూచన ఆందోళన కలిగిస్తోంది. అవును ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే అక్కడక్కడా వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతం నుంచి తమిళనాడు, ఏపీలోని కోస్తాపైకి తూర్పుగాలులు బలంగా వీస్తున్నాయి. దీని ప్రభావంతో కోస్తాలో గురువారం అక్కడక్కడ వర్షాలు కురిశాయి.
రాబోయే రెండు రోజుల్లో దక్షిణ కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని విశాఖపట్నం వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు ఈ తూర్పుగాలుల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లో పలుచోట్ల పగటిపూట వాతావరణం కూడా చల్లబడింది. రాత్రిపూట మంచు కురవడంతో కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం లేదా ఒకటి, రెండు డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి.
ఇక గురువారం నుంచి చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, కడప జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు కురిశాయి. తిరుపతితో పాటుగా శ్రీకాళహస్తి వైపుగా మరో సారి భారీగా వానలు పడ్డాయి. కొన్ని చోట్ల వర్షాల తీవ్రత చాలా ఎక్కువగా ఉండటంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. తిరుపతి పరిసర ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి.
లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యే అవకాశం ఉండటంతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాటు చేస్తున్నారు. కడప జిల్లా దక్షిణ భాగాలు, చిత్తూరు జిల్లా తూర్పు భాగాల్లో వర్షాలు మరో 24 గంటలు ఇదే పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. వాతావరణ హెచ్చరికల నేపద్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు చెబుతున్నారు.
తిరుపతితో పాటుగా శ్రీకాళహస్తి వైపుగా మరో సారి భారీ వర్షాలు కదులుతున్నాయి.కొన్ని చోట్ల వర్షాల తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. కడప జిల్లా దక్షిణ భాగాలు, చిత్తూరు జిల్లా తూర్పు భాగాల్లో వర్షాలు మరో నాలుగు గంటల పాటు కొనసాగనుంది. ప్రయాణించే వారు జాగ్రత్తపడండి. #APRains #TirupatiRains pic.twitter.com/TqRK6Za3qY
— Andhra Pradesh Weatherman (@APWeatherman96) December 30, 2021