తనపై తప్పుడు వార్తల రాసిన మీడియా సంస్థలపై హన్సిక ఫైర్ అయ్యారు. ఈ మేరకు తన ట్విటర్ ఖాతాలో వరుస ట్వీట్లు పెట్టారు. ఆ ట్వీట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
హీరోయిన్ హన్సిక మౌత్వాని టాలీవుడ్పై తప్పుడు వ్యాఖ్యలు చేసిందంటూ గత కొద్దిరోజులుగా ఓ వార్త మీడియాలో చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. ఓ ఇంటర్వ్యూలో హన్సిక మాట్లాడుతూ.. ‘‘ టాలీవుడ్ లో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నా. ఓ తెలుగు హీరో నన్ను ఇబ్బంది పెట్టాడు. డేట్ కి వస్తావా అని అడిగేవాడు. అతడికి తగిన రీతిలో బుద్ది చెప్పి పంపించా’’నని హన్సిక పేర్కొందంటూ సదరు మీడియా సంస్థలు వార్తలు రాశాయి. ఆ వార్తలు కాస్తా టాలీవుడ్లో చర్చకు దారి తీశాయి. అయితే, ఈ వార్తల్లో వాస్తవం లేదని తేలింది. వీటిపై స్వయంగా హన్సిక స్పందించారు.
ఆమె తన ట్విటర్ ఖాతా ద్వారా ఆ వార్తలపై క్లారిటీ ఇచ్చారు. మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవమని పేర్కొన్నారు. సదరు మీడియా సంస్థలపై ఆమె ఫైర్ అయ్యారు. ఆమె తన ట్విటర్ ఖాతాలో ఈ మేరకు కొన్ని పోస్టులు పెట్టారు. ఆ పోస్టుల్లో.. ‘‘ మీడియా సంస్థలకు నాదో విన్నపం. ఏదైనా న్యూస్ రాసే ముందు క్రాస్ చెక్ చేసుకోండి. నేను అలాంటి కామెంట్లు ఎప్పటికీ చేయను. గుడ్డిగా వార్తను పబ్లిష్ చేసే ముందు ఓ సారి క్రాస్ చెక్ చేసుకోండి’’ అని అన్నారు. మరో పోస్టులో .. ‘‘ నేను ఆ మాటలు అనలేదు. చెత్తను రాయటం ఆపండి’’ అని అన్నారు. కాగా, హన్సిక చైల్డ్ ఆర్టిస్ట్ గా హిందీ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు.
‘దేశముదురు’ మూవీతో హీరోయిన్ గా మారారు. అప్పటికి ఆమె వయసు కేవలం 14 సంవత్సరాలే. దేశముదురు సాధించిన విజయంతో హన్సికకు వరుస ఆఫర్లు వచ్చాయి. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో 50కి పైగా సినిమాల్లో నటించారు. 2022లో సొహైల్ కతురియా అనే వ్యక్తిని ప్రేమ పెళ్లి చేసుకున్నారు. మరి, తనపై తప్పుడు వార్తలు రాసిన మీడియా సంస్థలపై ఫైర్ అవ్వటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Publications urging you to cross check before picking up random news piece ! Never made this comment that’s doing the rounds pls fact check before publishing blindly .
— Hansika (@ihansika) May 23, 2023