ప్రముఖ సాఫ్ట్ వేర్ దిగ్గజం హెచ్సీఎల్ కంపెనీ.. హెచ్ సీఎల్ టెక్ బీ 2022 కార్యక్రమాన్ని ప్రకటించింది. ఈ కార్యక్రమం ద్వారా ఇంటర్న్ షిప్ తో పాటు గ్రాడుయేషన్ కూడా అందిస్తోంది. అంతేకాకుండా గ్రాడుయేషన్ తర్వాత వారి సంస్థలోనే ఉద్యోగం కూడా కల్పించనుంది. ఈ కార్యక్రమం ద్వారా ఎంట్రీ లెవల్ ఐటీ ఉద్యోగాలకు అవసరమైన స్కిల్స్ ను అందిస్తోంది. ఆ ఇంటర్న్ షిప్ పొందేందుకు ఎవరు అర్హులు? ఆ కార్యక్రమం గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి.
ఈ హెచ్ సీఎల్ టెక్ బీ 2022 కార్యక్రమంలో భాగంగా క్లాస్ రూమ్ ట్రైనింగ్, ఇంటర్న్ షిప్ ఉంటుంది. అభ్యర్థులకు నెలకు రూ.10 వేల చొప్పున స్టైఫండ్ కూడా చెల్లిస్తారు. ఈ కార్యక్రమం మొత్తం 12 నెలలు కొనసాగనుంది. ఎంపికైన అభ్యర్థులకు ఐటీ, సర్వీస్ డెస్క్, బిజినెస్ ప్రాసెస్ విభాగాల్లో.. ప్రోగ్రామ్ తర్వాత హెచ్సీఎల్ కంపెనీలో ఉద్యోగం కూడా కల్పిస్తారు. ఐటీ సర్వీసెస్, అసోసియేట్ల పేరిట పోస్టులను క్రియేట్ చేస్తారు.
ఈ కార్యక్రమం ద్వారా ఉద్యోగంలో చేరిన అభ్యర్థులకు బిట్స్ పిలానీ, ఆమిటీ, సస్ర్తా వంటి యూనివర్సిటీల నుంచి గ్రాడుయేషన్ చేసే అవకాశం కల్పిస్తారు. ఈ ఉద్యోగంలో చేరాలంటే.. అభ్యర్థులు కెరియర్ ఆప్టిట్యూడ్ టెస్ట్(క్యాట్)లో అర్హత సాధించాల్సి ఉంటుంది. నోయిడా, లక్నో, నాగ్పూర్, చెన్నై, హైదరాబాద్, మధురై, విజయవాడ ప్రాంతాల్లో శిక్షణ ఇస్తారు. ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాల కోసం https://www.hcltechbee.com/ వెబ్ సైట్ ని పరిశీలించండి.
2021/ 2022 విద్యా సంవత్సరంలో కనీసం 60 శాతం మార్కులతో ఇంటర్/12వ తరగతి పాస్ అయి ఉండాలి. ఇంటర్లో తప్పనిసరిగా లెక్కలు/బిజినెస్ మ్యాథమెటిక్స్ సబ్జెక్టులు చదివి ఉండాలి. ఇంకా ఇంటర్/12వ తరగతి 2022 ఫలితాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. హెచ్ సీఎల్ కల్పిస్తున్న ఈ ఇంటర్న్ షిప్ ప్రోగ్రామ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.