ఫిల్మ్ డెస్క్- నటి కవిత లక్ష్మి.. మలయాళంలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్. ఇప్పటి తరానికి పెద్దగా తెలియకపోవచ్చు గానీ, పదిహేనేళ్ల క్రితం మలయాళ సినిమా ఇండస్ట్రీలో మంచి పేరున్న నటి. దాదాపు అందరు హీరోల సరసన నటించిన కవిత లక్ష్మి, తన కొడుకు చదువు కోసం చాలా ఇబ్బందులు ఎదుర్కొంది. ప్రస్తుతం కవిత లక్ష్మి పరిస్థితి ఎంత దీనంగా మారిందంటే, నడిరోడ్డుపై దోసెలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తోంది.
ఒకప్పటి హీరోయిన్ కవిత లక్ష్మి రోడ్డుపై దోసెలు అమ్ముతుంటే, ఆమెను గుర్తుపట్టిన ఓ వ్యక్తి దోసెలు వేస్తున్న నన్ను వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ క్రమంలోనే కవిత లక్ష్మి గురించి సోషల్ మీడియాలో పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. దీనిపై స్పందించిన కవితా లక్ష్మి, తను ఈ స్ఖితికి రావడానికి గల కారణాలను వివరించారు.
తన కొడుకు ఉన్నత చదువుల కోసం లండన్ పంపించడానికి ఒక ట్రావెల్ ఏజెన్సీ సహాయం చేస్తామని చెప్పడంతో తన కొడుకును పంపించానని, ప్రతి సంవత్సరం లక్ష రూపాయలు కడితే చాలు మొత్తం మేమే చూసుకుంటామని చెప్పడంతో నమ్మి పంపించానని చెప్పారు. అయితే ఆ ట్రావెల్ ఏజెన్సీ తనని ఘోరంగా మోసం చేసందని, ఆఱు నెలల తరువాత మొత్తం డబ్బు ఒకేసారి ఇవ్వాలని చెప్పడంతో తన కష్టాలు మొదలయ్యాయని చెప్పుకొచ్చారు కవిత లక్ష్మి.
తన ఆర్థిక కష్టాల నుంచి బయట పడటం కోసం పలు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నానని చెప్పారు. వాటిని తీర్చడం కోసం దొరికిన చోటల్లా అప్పులు చేశానని చెప్పుకొచ్చారు. చివరికి అప్పుల వాళ్ల నుంచి ఒత్తిడి పెరగడంతో చేసేది లేక ఇలా దోశలు వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని నటి కవిత లక్ష్మి చెప్పారు. పాపాం కదా..