దేవుని సృష్టిలో చాలానే వింతలు ఉన్నాయి. ఇక అనేక జీవ రాశులకి.. కడలి గర్భమే పుట్టినిల్లు. అలాంటి సముద్రంలో మనకి తెలియని ఎన్నో విచిత్రాలు ఉంటాయి. ఇక ఈ సముద్రంలో కనీవినీ వింత జీవులు శాస్త్రవేత్తలకు సైతం ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటాయి. తాజాగా ఇలాంటి ఒక షీప్ హెడ్ చేప అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. దీనికి కారణం ఏమిటో తెలుసా? ఈ షీప్ హెడ్ చేప.. మనిషికి ఎలా అయితే పళ్ళు ఉంటాయో.. అలాంటి పళ్ళని కలిగి ఉంది.
అమెరికాలోని నార్త్ కెరొలినా రాష్ట్రంలోని నగ్స్ హెడ్ ప్రాంతంలో దీనిని గుర్తించారు. అత్యంత అరుదైన ఈ చేప చిక్కడంతో ప్రస్తుతం శాస్త్రవేత్తలు దీనిపై పరిశోధనలు చేస్తున్నారు. అయితే.., దీని పళ్ళు చాలా పదునుగా ఉన్నాయి . పొరపాటున ఇవి గుచ్చుకున్నా మనిషి విలవిలలాడిపోవడం ఖాయమని శాస్త్రవేత్తలు తెలియచేస్తున్నారు. ఒక్కోసారి ప్రాణాలు సైతం పోయే ప్రమాదం లేకపోలేదు. సో.. చూశారు కదా అన్నీ మనం తినే చేపలే కాదు.., మనల్ని తినే చేపలు కూడా ఉంటాయి. తస్మాత్ జాగ్రత్త.