తెలంగాణ వ్యాప్తంగా ఇప్పుడు ఏ ఇద్దరు కలిసినా.. వినిపిస్తున్న పేరు “హుజూరాబాద్”. అందరికీ హుజూరాబాద్ ఉపఎన్నికే హాట్ టాపిక్. ఈ ఉపఎన్నికకు ఎందుకు ఇంత హైప్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో సీనియర్ నాయకుడిగా ఉండి, కరోనా వేళ ఆరోగ్యశాఖ మంత్రిగా సేవలందించిన ఈటల రాజేందర్ ఎందుకు టి.ఆర్.ఎస్ నుండి బయటకు వచ్చారు? ప్రభుత్వ భూముల ఆక్రమించారంటూ ఆరోపణలు ఎందుకు వచ్చాయి? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు ఇప్పటికీ సరైన సమాధానాలు లేవు. ఈ నేపథ్యంలో సుమన్ టీవీ సరికొత్త పోగ్రామ్ “బ్లాక్ & వైట్ విత్ జాఫర్” ద్వారా ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం దొరకబోతుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.
హుజూరాబాద్ విజయం ఇప్పుడు ఇటు తెరాసకు, అటు ఈటల రాజేందర్ కి ప్రతిష్టాత్మకమే. ఈ నేపథ్యంలోనే తనపై వచ్చిన అన్నీ ఆరోపణలకి ఈటల రాజేందర్ సమాధానం ఇచ్చే ప్రయత్నం చేశారు. బ్లాక్ & వైట్ విత్ జాఫర్” పోగ్రామ్ లో సీనియర్ జర్నలిస్ట్ జాఫర్ ఈటల ముందు కొన్ని ఆసక్తికరమైన ప్రశ్నలు ఉంచారు. “తెరాస నాయకులు.. ఈటల రాజేందర్ కొన్ని వేలకోట్లకు పడగలెత్తాడు. ప్రభుత్వ భూమిని ఆక్రమించాడన్న విమర్శలు చేస్తున్నారు. ఆ మాటల్లో కొంత కూడా నిజం లేదా అంటూ.. జాఫర్ ప్రశ్నలు సంధించాడు. వీటికి ఈటల నుండి కూడా అంతే స్థాయిలో సమాధానాలు రావడం విశేషం. ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదల అయ్యింది. సుమన్ టీవీకి ఎక్స్ క్లూజివ్ గా ఇచ్చిన ఈ ఇంటర్వూ ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి.. ఈ మొత్తం వ్యవహారంలో ఈటల వెర్షన్ పూర్తిగా తెలియాలంటే..ఫుల్ ఎపిసోడ్ విడుదల అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే. మరి.. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియ చేయండి.