రాజన్న సిరిసిల్ల- బుల్లెట్ బండెక్కి వచ్చేస్తా.. ఇప్పుడు ఎక్కడ చూసినా ఈపాటే వినిపిస్తోంది. గత కొన్ని రోజులుగా ఈ జానపద పాట బాగా పాపులర్ అయ్యింది. మొన్న మంచిర్యాల జిల్లాలో పెళ్లి కూతురు సాయిశ్రేయ చేసిన డ్యాన్స్కు అందరూ ఫిదా అవ్వడంతో పాటు బుట్టెల్ పాట మరింత వైరల్ అయ్యింది. బుల్లెట్ బండి సాంగ్ మూడు నాలుగు రోజులుగా సోషల్ మీడియాలో హాల్చల్ చేస్తోంది. ఒక్క యూట్యూబ్ లోనే ఈ పాటకు పెళ్లి కూతురు చేసిన డ్యాన్స్ ను కోట్ల మంది చూస్తున్నారంటే ఎంత క్రేజ్ ఉందో అర్ధమవుతోంది.
బుల్లెట్ బండెక్కి వస్తా పాట కొత్తపెల్లి కూతురు సాయిశ్రేయ జంటను బాగా పాపులర్ చేస్తే, ఓ ప్రభుత్వ నర్సును మాత్రం చిక్కుల్లో పడేసింది. ఈ పాటపై తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో స్వాతంత్య్ర దినోత్స వేడుకల రోజు ప్రభుత్వ ఆస్పత్రిలో పనిచేస్తున్న నర్సు సరదాగా చేసిన డ్యాన్స్ వైరల్గా మారింది. జిల్లాలోని తంగళ్లపల్లి ప్రైమరీ హెల్త్ సెంటర్ లో స్వాతంత్య్ర వేడుకలు ముగిసిన తరువాత కారిడార్లో రజని అనే స్టాఫ్నర్సు సరదాగా బుల్లెట్ బండి పాటపై డ్యాన్స్ చేసింది.
నర్సు డ్యాన్స్ కు సంబందించిన వీడియోను ఆమె ఫ్రెండ్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇంకేముంది నర్స్ డ్యాన్స్ కాస్త వైరల్గా మారింది. ప్రభుత్వ ఆసుపత్రిలో డాన్స్ చేయడంతో ఆ నర్సుపై అధికారులు గుర్రుగా ఉన్నారు. దీనిపై స్పందించిన వైద్య ఆరోగ్యశాఖ అధికారులు శనివారం డాన్స్ చేసిన స్టాఫ్ నర్స్కు మోమో జారీ చేశారు. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్కు నివేదిక కూడా అందించారు. మరిప్పుడు ఆ నర్సుపై ఎలాంటి చర్యలు తీసుకుంటారోనని అందరిలో ఉత్కంఠ నెలకొంది.
ఈ వివాదం ఎలా ఉన్నా బుల్లెట్ బండెక్కి వస్తా పాటకు నర్స్ చేసిన డ్యాన్స్ మాత్రం సోషల్ మీడియాలో దూసుకుపోతోంది. పాటకు అనుగనంగా ఆమె బాగా డ్యాన్స్ చేసిందన నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. మరోవైపు ఎదో సరదాగా డ్యాన్స్ చేసిన నర్సు విషయంలో అధికారులు చర్యలు తీసుకోవద్దని కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు నెటిజన్స్.