ప్రముఖ హిందూ పుణ్య క్షేత్రమైన తిరుమలలో టీ కప్పులపై క్రిస్టియన్ మతానికి చెందిన శిలువ గుర్తు కలకలం రేపింది. ఓ టీ కొట్టులో T అక్షరాన్ని శిలువ గుర్తులో ముద్రించారు. దీంతో భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కలియుగ దైవం శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ్వర స్వామి కొండపై ఇటీవలి కాలంలో పలు అపచారాలు చోటుచేసుకుంటున్నాయి. వేలాది మంది భక్తులు దర్శించుకునే తిరుమలలో కొంత మంది వ్యక్తులు చేసే పనులు భక్తులకు ఆగ్రహం తెప్పిస్తున్నాయి. శ్రీవారిని తమ ఆరాధ్యదైవంగా భావించి, కోరిన కోర్కెలు తీర్చే శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనానికి తెలుగు రాష్ట్రాల నుంచే కాక ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు వస్తారు. శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. అంతటి పవిత్ర హిందూ పుణ్యక్షేత్రమైన తిరుమలలో టీ కప్పులపై ఓ మతానికి చెందిన శిలువ గుర్తు ను ముద్రించి భక్తులకు ఆగ్రహం తెప్పిస్తున్నారు.
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారిని నిత్యం వేలాది మంది దర్శించుకుంటూ మొక్కులు చెల్లించుకుంటారు. వారి సమస్యలు తీరాలని ముడుపులు చెల్లిస్తుంటారు. ఇంతటి పవిత్రమైన పుణ్య క్షేత్రంలో టీ కప్పులపై ఏసు మతానికి చెందిన శిలువ గుర్తును ముద్రించిన ఘటన తీవ్ర కలకలం రేపింది. టీ కప్పులపై ‘టి’ అనే ఆంగ్ల అక్షరాన్ని శిలువ గుర్తులాగా ముద్రించారు. ఇది గమనించిన శ్రీ వారి భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భక్తులు అందించిన సమాచారంతో టిటిడి అధికారులు టీ దుఖానాలలో తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో భాగంగా ఓ షాప్ లో శిలువ గుర్తు ఉన్న టీ కప్పులను గుర్తించారు. వెంటనే ఆ టీ కప్పులను స్వాధీనం చేసుకుని ఆ టీ దుఖానాన్ని సీజ్ చేశారు. తిరుమల పవిత్రతను భంగం కలిగించేలా వ్యవహరించిన ఆ టీ కొట్టు యజమానిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉంటే ఆ మధ్య డ్రోన్ కెమెరాలతో శ్రీవారి ఆలయాన్ని చిత్రీకరించడం, ఇప్పుడు టీ కప్పులపై శిలువ గుర్తు కనిపించడంతో భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.