స్పెషల్ డెస్క్- సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఏ వార్త అయినా క్షణాల్లో చేరిపోతోంది. ప్రపంచంలో ఎక్కడ ఏంజరిగినా మన చేతిలోని స్మార్ట్ ఫోన్ కు వచ్చేస్తోంది. ఐతే సోషల్ మీడియాలో వచ్చే వాటిలో దేన్ని నమ్మాలో, దెన్ని నమ్మకూడదో తెలియడం లేదు. ప్రధానంగా సైబర్ నేరాలు పెరిగిపోయిన నేపధ్యంలో సోషల్ మీడియాలో వచ్చే వార్తలపై అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు పోలీసులు.
సోషల్ మీడియా ఇటీవల వైరల్ అవుతున్న ఓ వార్తపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. కేంద్ర ఆర్థిక శాఖ ప్రతి నెలా ఒక్కొక్కరికి 1 లక్షా 30 వేల రూపాయలను ఇస్తోందని, ఆరు నెలల వరకు ఈ డబ్బులు అందుతాయని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీన్ని బట్టి ఒక్కొక్కరికి సుమారుగా 7.8 లక్షల రూపాయలు వస్తాయన్నమాట.
ఇందుకు సంబందించి సోషల్ మీడియాలో ప్రచారం జరగడంతో పాటు, ఒక లింక్ కూడా సర్కులేట్ అవుతోంది. ఇటువంటి అద్భుతమైన అవకాశాన్ని కోల్పోవద్దని, వెంటనే లింక్పై క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకోండి అని మెసేజ్ వైరల్ అవుతోంది. ఇలాంటి మెసేజ్లోని లింక్పై క్లిక్ చేసి మీ వివరాలు అందిస్తే, ఇక అంతే సంగతులు. మీ బ్యాంకు ఖాతాలో ఉన్న డబ్బులన్నీ మాయం అయిపోతాయి.
అందుకని ఇలాంటి మోసపూరిత మెసేజ్లతో జాగ్రత్తగా ఉండాలి. ఇక ఇదంతా ఫేక్ అని కేంద్ర ప్రభుత్వానికి చెందిన పీఐబీ ఫ్యాక్ట్ చెక్ స్పష్టం చేసింది. ఇలాంటి మెసేజ్లను నమ్మవద్దని, వీటితోప్రజలు జాగ్రత్తగా ఉండాలని తెలిపింది. అందుకని ఇకపై ఇలాంటి మోసపూరిత మెస్సెజ్ లు, లింక్ లు వస్తే వాటిపై ఏ మాత్రం క్లిక్ చేయవద్దు.
This WhatsApp forward claiming that @FinMinIndia is providing emergency cash where recipients will receive Rs 1,30,000 per month for 6 months is #FAKE!
❌Don’t believe this message
❌Don’t forward such links
❌Never disclose personal information on such websites#PIBFactCheck pic.twitter.com/3okZwNHyhA
— PIB Fact Check (@PIBFactCheck) July 29, 2021