వర్షాలతో తెలుగు రాష్ట్రాల ప్రజలే కాదూ.. ఉత్తర భారతం కూడా అతలాకుతలం అవుతుంది. ఇటీవల కురిసిన వర్షాలకు గంగానది, దాని ఉపనదులు పొంగిపొర్లుతున్నాయి. వాగులు, వంకల నుండి వరద నీరు వేగంగా ప్రవహిస్తూ చెరువులు, నదులకు చేరుతున్నాయి.
వర్షాలతో తెలుగు రాష్ట్రాల ప్రజలే కాదూ.. ఉత్తర భారతం కూడా అతలాకుతలం అవుతుంది. ఇటీవల కురిసిన వర్షాలకు గంగానది, దాని ఉపనదులు పొంగిపొర్లుతున్నాయి. వాగులు, వంకల నుండి వరద నీరు వేగంగా ప్రవహిస్తూ చెరువులు, నదులకు చేరుతున్నాయి. దీంతో నదుల్లో నీటి మట్టం పెరుగుతుంది. లోతట్టు ప్రాంతాలు, కాలనీలు నీట మునిగాయి. రోడ్లపై నీరు ప్రవహించడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందిగా మారిపోతుంది. మోకాళ్లతోతు నీరు చేరడంతో వాహనాలు నీటిలో తేలియాడుతున్నాయి. గంగా నది పొంగి పొర్లడంతో ఉత్తరప్రదేశ్ లో ఓ బస్సు నీటిలో చిక్కుకుపోయింది. అయితే అందులో ప్రయాణీకులు ఉండటం గమనార్హం.
ఉత్తరప్రదేశ్లోని బిజ్నోర్లో గంగా నది, దాని ఉపనదులు ఉప్పొంగుతున్నాయి. కోటవాళి నది ఉగ్ర రూపం దాల్చింది. దీంతో నీటి మట్టాలు పెరగడంతో హర్దివార్-బిజ్నోర్ రహదారిపై నీరు ఒక్కసారిగా ప్రవహించడంతో.. అప్పుడే అటుగా వెళ్తున్న చార్ ధామ్ యాత్రికుల బస్సు చిక్కుకుంది. ఆ సమయంలో బస్సులో 25 మంది ప్రయాణీకులున్నారు. మండవాలి ప్రాంతంలో నీటి ప్రవాహంలో ఈ బస్సు నీటిలో ఇరుక్కుపోయింది. క్రేన్ని ఉపయోగించి వాహనం బోల్తా పడకుండా బయటకు తీసేందుకు ప్రయత్నాలు చేశారు. కొంత మంది బస్సుపైకి ఎక్కి ఆర్తనాదాలు చేస్తున్నారు. దీనికి సంబంధించిన దృశ్యాలు వీడియోలో కనిపిస్తున్నాయి.
Bus with 25 passengers stuck in water flow in Mandawali region of UP’s Bijnor due to sudden rise in water levels in Kotawali seasonal river on Hardiwar-Bijnor road. Efforts on to prevent overturning of the vehicle using a crane.pic.twitter.com/FVDZKf868B
— Waquar Hasan (@WaqarHasan1231) July 22, 2023