ఇంతకాలం దేశవ్యాప్తంగా ప్రధాన నగరాలలో మనం ఫుడ్ డెలివరీ యాప్ సిస్టమ్స్ మాత్రమే చూశాం. కానీ ఆన్ లైన్ లో వాటర్ సప్లై అనేది కొంచం కొత్తగా అనిపిస్తుంది. వినటానికి ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజం. టెక్నాలజీని బేస్ చేసుకొని స్మార్ట్ ఫోన్ లకు అనుకూలంగా అన్నిరకాల సేవలు యాప్స్ రూపంలో జనాలకు దగ్గరవుతున్నాయి.
ఇకపై తినే ఫుడ్ మాత్రమే కాదు.. తాగే వాటర్ కూడా ఆన్ లైన్ లోనే ఆర్డర్ ఇవ్వవచ్చు. స్మార్ట్ ఫోన్ లో బుక్ చేసుకుంటే 24 గంటల్లో ఇంటికి డెలివరీ వచ్చేస్తాయి. ప్రముఖ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ సంస్థ బిస్లేరీ ఇంటర్నేషనల్ (Bisleri International) ఈ నూతన పద్ధతికి స్వగతం పలికింది. దేశవ్యాప్తంగా హైదరాబాద్తో పాటు బెంగళూరు, అహ్మదాబాద్, గురుగ్రామ్ సహా మొత్తం 26 నగరాలకు ఈ వాటర్ డెలివరీ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది బిస్లేరి.
స్మార్ట్ ఫోన్ లో బుక్ చేస్తే చాలు.. వాటర్ క్యాన్స్, బాటిల్స్ 24 గంటల్లో ఇంటి వద్ద డెలివరీ అయిపోతాయి. ఈ యాప్ ద్వారా 24×7 ఆర్డర్ సేవలను అందిస్తోంది బిస్లేరి. కస్టమర్స్ వాటర్ బుక్ చేసుకునేందుకు మొబైల్ యాప్(బిస్లేరి@డోర్ స్టెప్ – Bisleri@Doorstep) సర్వీస్)ను తీసుకొచ్చింది. ఇకపై నిత్యావసరాలను ఆన్ లైన్ లో బుక్ చేసుకున్నట్లుగా.. బిస్లేరి వాటర్ బుక్ చేసుకోవచ్చు. కోవిడ్-19 కారణంగా లాక్డౌన్లు వచ్చాక వినియోగదారుల ఇళ్లకే వాటర్ డెలివరీ చేయడం ప్రారంభించింది బిస్లెరీ.
అదేవిధంగా మొబైల్ యాప్ అయితే ఇంకా జనాలకు సులభతరంగా డెలివరీ చేయొచ్చనే ఆలోచనతో యాప్ లాంచ్ చేసినట్లు బిస్లేరి తెలిపింది. అలాగే సంస్థకు చెందిన అన్ని ఉత్పత్తులను ఈ యాప్ ద్వారా ఆర్డర్ చేయవచ్చని ప్రకటించింది. ఈ యాప్లో వాటర్ ఆర్డర్ చేశాక.. ఆర్డర్ ఏ దశలో ఉందో యూజర్లు ట్రాక్ చేయవచ్చు. ప్రస్తుతం ఆండ్రాయిడ్, యాపిల్ ఐఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్ మొబైల్ ఫోన్ లకు యాప్ను తీసుకొచ్చింది. మొబైల్ యాప్ లాంచ్ చేసిన తొలి ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ సంస్థగా బిస్లెరీ నిలిచిందని బిస్లెరీ ఇంటర్నేషనల్ సీఈవో అంజెలో జార్జ్ చెప్పుకొచ్చారు.