గత కొంతకాలంగా తెలుగు రాష్ట్రాల్లో రేవ్ పార్టీ కల్చర్ విపరీతంగా పెరిగిపోయింది. అసలే కరోనా మహమ్మారి తో రాష్ట్రాల్లో పరిస్థితి దారుణం గా ఉన్న సమయంలో ఇలాంటి పార్టీలు సైతం పెద్ద తలనొప్పిగా మారుతున్నాయి. శివారు రిసార్ట్స్ లో రేవ్ పార్టీలు గుట్టు చప్పుడు కాకుండా నిర్వహిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. గుంటూరులో రీసెంట్ గా జరిగిన ఓ బర్త్ డే వేడుకల్లో జరిగిన అసభ్య నృత్యాల్లో పాల్గొన్న సీఐపై సస్పెన్షన్ వేటు పడింది. రెస్టారెంట్లో జరిగిన జన్మదిన వేడుకల్లో పాల్గొన్న సీసీఎస్ సీఐ వెంకటేశ్వర్లుపై సస్పెండ్ వేటు వేస్తూ గుంటూరు రేంజ్ ఐజీ తివిక్రమ వర్మ ఆదేశాలు జారీ చేశారు.
గుంటూరు నగరంలోని ఇన్నర్ రింగు రోడ్డు సమీపంలో ఉన్న తెలుగింటి రుచులు రెస్టారెంట్లో రాకేష్ అనే వ్యక్తి జన్మదిన వేడుకల్లో భాగంగా తన స్నేహితులతో కలిసి మద్యం సేవించటంతో పాటు, విజయవాడ నుంచి పిలిపించిన ఆరుగురు యువతులతో కొందరు అసభ్య నృత్యాలు చేశారు. ఈ క్రమంలో పక్కా సమాచారం అందుకున్న పట్టాభిపురం పోలీసులు దాడి చేసి మొత్తం 25 మందిని అదుపులోకి తీసుకున్నారు.
వారిపై కోవిడ్ నిబంధనలు అతిక్రమించటం, అధిక శబ్ధాలతో ఇతరులకు ఇబ్బంది కలిగించడం, దీంతో పాటుగా మద్యం సేవించటం, అసభ్యకరమైన నృత్యాలు చేసిన కేసు నమోదు చేసి, స్వంత పూచీకత్తులపై పంపించి చేశారు. పార్టీకి అర్బన్ సీసీఎస్లో పని చేస్తున్న సీఐ వెంకటేశ్వర రావు కూడా హాజరయ్యారని తేలడంతో ఆయనపై శాఖాపరమైన చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో ఇవాళ సీఐపై వేటు పడింది.
తాము అక్కడ జరిగిన తంతుని వీడియో చిత్రీకరించామని, ఎటువంటి అశ్లీల నృత్యాలు జరగలేదని తెలిపారు. సమాచారం వచ్చిన వెంటనే దాడి చేయటం జరిగిందని వివరించారు. పూర్తిస్థాయిలో దర్యాప్తు అనంతరం కేసు నమోదు చేసినట్లు వివరించారు.