ఫిల్మ్ డెస్క్- తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, ఒకప్పటి హీరోయిన్ జయలలితకు, తెలుగు నటుడు శోభన్ బాబుకు మధ్య సంబంధం ఉందని, వారిద్దరికి ఓ కూతురు కూడా పుట్టిందని, ఆ కూతురును రహస్యంగా పెంచుతున్నారని అప్పట్లో బాగా ప్రచారం జరిగింది. ఇప్పుడైతే జయలలిత, సోభన్ బాబు లేరనుకొండి. కానీ వాళ్లు బతికి ఉన్నప్పుడు కూడా ఈ ప్రచారంపై ఇద్దరిలో ఎవరు పెదవి విప్పలేదు. దీంతో చాలా మంది నిజమే కాబోలు అనుకున్నారు.
ఐతే జయలలిత, శోభన్ బాబుల రిలేషన్ షిప్ గురించి ప్రమఖ దర్శకులు తమ్మారెడ్డి భరద్వాజ ఆసక్తికరమైన విషయాలు చెప్పారు. శోభన్ బాబు, జయలలిత కలసి తెలుగులో డాక్టర్ బాబు సినిమాలో మాత్రమే కలిసి పనిచేశారని ఆయన చెప్పారు. ఆ సినిమా షూటింగ్ సందర్బంగా తానే వాళ్లిద్దరికి ఒకరికొకరిని పరిచయం చేశానని భరద్వాజ చెప్పారు. కోయంబత్తూర్ ఎయిర్ పోర్ట్కి వెళ్లి, శోభన్ బాబును కారులో ఎక్కించుకుని, ఊటీ షూటింగ్ లొకేషన్కి తీసుకుని వచ్చానని గుర్తు చేసుకున్నారు.
అక్కడ జయలలితను శోభన్ బాబుకు పరిచయం చేశానని భరద్వాజ తెలిపారు. ఇక ప్రతి మనిషికి ఓ వీక్నెస్ ఉంటుందని, పర్సనల్ అటాచ్ మెంట్సు ఉంటాయని భరద్వాజ అన్నారు. ప్రతి విషయాన్ని నెగిటివ్గా తీసుకోకూడదని, శోభన్ బాబుకు, జయలలితకు ఉండే ప్రాబ్లమ్స్ వల్ల వాళ్లిద్దరు కలిసి ఉన్నారని చెప్పారు. ఈ విషయం దేశం మొత్తం తెలిసిందేనని భరద్వాజ అన్నారు. ఐతే వాళ్లిద్దరికి పిల్లలు పుట్టారని, వాళ్లని దాచిపెట్టారని జరిగిన ప్రచారంలో మాత్రం వాస్తవం లేదని చెప్పారు.
జయలలితకు కూతురు ఉంటే, శశికళని ఆదరించే బదులు, తన సొంత కూతురునే తన దగ్గర పెట్టుకునేదు కదా అని భరద్వాజ వ్యాఖ్యానించారు. ముక్కూ మొహం తెలియని శశికళని ముఖ్యమంత్రి రేంజ్కి తీసుకెళ్లిన జయలలిత, సొంత కూతురే ఉండి ఉంటే అలా ఎందుకు దాచిపెడుతుందని ఆయన ప్రశ్నించారు. కాబట్టి అందులో ఏ మాత్రం నిజం లేదని కొట్టిపారేశారు తమ్మారెడ్డి భరద్వాజ.