శారీరిక సుఖం కోసం విలువలను కోల్పోవడమే కాదు, ప్రాణాలను తీయడానికి కూడా వెనకాడటం లేదు కొంత మంది దుర్మార్గులు. ప్రేమికుడి మోజులో పడి పచ్చటి సంసారాన్ని నాశనం చేకుంటున్న మహిళలు కూడా ఈరోజుల్లో ఎక్కువయ్యారు. అచ్చం ఇలాంటి ఘటనే తాజాగా బెంగుళూరులో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే.. బెంగళూరులోని కెంపెగౌడ నగర్ ప్రాంతంలో కార్తీక్, రంజిత అనే దంపతులు జీవిస్తున్నారు. వీరిది ప్రేమ వివాహం. ఆటో డ్రైవర్గా పనిచేసే కార్తీక్ వచ్చిన సంపాదనతోనే భార్యను బాగా చూసుకుంటు వచ్చాడు. భార్య మీద విపరీతమైన నమ్మకం అతనికి. అందుకే ఎప్పుడూ ఆమె ఇష్టా ఇష్టాలకి అడ్డు చెప్పలేదు.
ఈ క్రమంలో కొద్ది నెలల క్రితం కార్తీక్ తన స్నేహితుడైన సంజీవ్ను తన ఇంటికి ఆహ్వానించాడు. భార్యకి సంజీవ్ ని పరిచయం చేశాడు. కానీ.., అప్పుడే రంజిత చూపు కార్తీక్ పై పడింది. సంజీవ్ కూడా రంజిత అందానికి, కవ్వింపుకి ఆకర్షితుడయ్యాడు. ఇద్దరూ మంచి చెడు మరచిపోయి ఫోన్ లో చాటింగ్ చేసుకోవడం మొదలు పెట్టారు. ఆ తరువాత మీటింగ్స్, డేటింగ్స్ అన్నీ మొదలయ్యాయి. రోజూ కార్తీక్ ఆటో తీసుకుని బయటికి వెళ్లగానే రంజిత తన ప్రియుడిని ఇంటికి రప్పించుకుని రాసలీలలు కొనసాగించేది. అప్పుడప్పుడు తానే సంజీవ్ ఇంటికి వెళ్లి ఎంజాయ్ చేసేది.
వీరిద్దరూ ఫోన్ లో ఎక్కువగా చాట్ చేసుకుంటూ ఉండటంతో కార్తీక్ భార్యని హెచ్చరించాడు. దీంతో.., కార్తీక్ బతికుంటే తమ బంధానికి ఎప్పటికైనా అడ్డే అని భావించిన రంజిత, సంజీవ్ అతన్ని చంపేయాలని నిర్ణయించుకున్నారు. ప్లాన్ లో భాగంగా.. కార్తీక్ను పార్టీ పేరుతో పిలిచి పుల్లుగా మద్యం తాగించి.. ఆ ముత్తులో ఉండగానే సంజీవ్ అతన్ని తీవ్రంగా కొట్టి హతమార్చాడు. తరువాత మృతదేహాన్ని వృషభవతి నదిలో పడేశాడు.
తన ప్రియుడి ద్వారా.. భర్త చనిపోయిన వార్త తెలుసుకున్న రంజిత మరో నాటకానికి తెర తీసింది. తమ మీద ఎవరికీ అనుమానం రాకుండా ఆమే పోలీసుల వద్దకి వెళ్లి.., తన భర్త కనిపించడం లేదంటూ కంప్లైంట్ చేసింది. విచారణలో రంజిత ఫోన్ కాల్స్, మెసేజెస్ చెక్ చేసిన పోలీసులకి అసలు నిజాలు తెలిశాయి. తమదైన స్టయిల్ లో రంజితని, సంజీవ్ ని విచారించగా వారు చేసిన నేరం ఒప్పుకుని కటకటాల పాలయ్యారు. మరి.., ఇలాంటి వారికి ఏ శిక్ష విధించాలి? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.