జైపూర్ (నేష్నల్ డెస్క్)- కరోనా మహమ్మారి చిన్నాపెద్దా తేడా లేకుండా అందరినీ కమ్మేస్తోంది. సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు అందరూ కరోనా బాధితులుగా మారుతున్నారు. తాజాగా కాంగ్రెస్ సీఎం అశోక్ గెహ్లాట్ కరోనా బారిన పడ్డారు. తనకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయిందని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ట్వీట్ ద్వారా తెలిపారు. నిన్న ఆయన భార్య సునీతకి కరోనా పాజిటివ్గా నిర్ధారణ కావడంతో హోం ఐసోలేషన్లో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. తాను కూడా ఐసోలేషన్లో ఉండనున్నట్లు సీఎం తెలిపారు.ఇక ఈరోజు కరోనా టెస్టు చేయించుకోగా తనకు పాజిటివ్గా తేలిందని, అయితే లక్షణాలేవీ లేవని సీఎం తెలిపారు. ఐసోలేషన్లో ఉంటూ విధులు నిర్వహిస్తానని ఆయన చెప్పారు. ఇటీవల పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కరోనా బారిన పడ్డారు. ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, కర్ణాటక సీఎం బీఎస్ యెడియూరప్ప, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, తమిళనాడు సీఎం ఎడప్పాడి పళనిస్వామి కరోనా నుంచి కోలుకున్నారు. మరి కొంత మంది సినీ, రాజకీయ ప్రముఖులు సైతం కరోనా బారిన పడి చికిత్స తీసుకుంటున్నారు.