గత కొంత కాలంగా దేశంలో భారీగా డ్రగ్స్ పట్టుపడుతున్నాయి. యువతని మత్తులోకి దించే కేటుగాళ్లు రక రకాల పద్దతుల్లో గంజాయి, హెరాయిన్ తరలిస్తున్నారు. అయితే పక్కా సమాచారం అందుకుంటున్న పోలీసులు వారిపై దాడి చేస్తూ వాటిని సీజ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. భారతదేశ చరిత్రలోనే తొలిసారిగా భారీ స్థాయిలో గంజాయిని.. ఏపీ పోలీస్ శాఖ దహనం చేసింది. రాష్ట్రంలో ఆపరేషన్ పరివర్తన్ కార్యక్రమం చేపట్టి.. పోలీసుల సహకరాంతో గంజాయి సాగుపై ఉక్కుపాదం మోపింది జగన్ సర్కార్. విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో డీజీపీ గౌతం సవాంగ్ వివిధ శాఖల సమన్వయంతో, సరిహద్దు రాష్ట్రాల సహకారాలతో ఈ కార్యక్రమం చేపట్టారు.
విశాఖ ఏజెన్సీలో భారీ స్థాయిలో గంజాయి తోటలపై ఉక్కుపాదం మోపింది పోలీసు శాఖ. విశాఖ మన్యంతోపాటు ఆంధ్రా-ఒడిశా సరిహద్దు గ్రామాల్లో ఎన్నో ఏళ్లుగా గంజాయి సాగు కొనసాగుతోంది. దేశంలోని వివిధ ప్రాంతాలకు వైజాగ్ నుంచే గంజాయి వెళ్తుందనే కామెంట్స్ వినిపించాయి. అంతేకాదు మత్తు సాగుకు విశాఖ హబ్గా మారిందని విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో పట్టుబడిన 2లక్షల కిలోల గంజాయిని శనివారం దహనం చేశారు.
ఈ కార్యక్రమాన్ని ఓ ఈవెంట్లా చేయనుంది పోలీస్ శాఖ. దీని కోసం టెంట్లు, స్పీకర్లు, డ్రోన్ కెమెరాలు వాడుతున్నట్లు సమాచారం. ఈ గంజాయి విలువ సుమారు రూ.500 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అలాగే గంజాయి సాగు చేయకుండా యువతకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఇతర పంటలు సాగు చేసేలా ప్రోత్సహించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ మాట్లాడుతూ.. ఏవోబీ ప్రాంతాల్లోని గ్రామాల్లో కొన్ని దశాబ్దాలుగా గంజాయి అక్రమ సాగు కొనసాగుతుందని తెలిపారు. గంజాయిని సమూలంగా నాశనం చేసేందుకు ఆపరేషన్ పరివర్తన కార్యక్రమం చేపట్టినట్లు పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల వారు ఇక్కడ యువతను డబ్బుకు ప్రలోభ పెడుతూ ముఠాలగా ఏర్పడి ఏవోబీలో యథేచ్ఛగా గంజాయి సాగు, అక్రమ రవాణా వ్యాపారాన్ని కొనసాగిస్తున్నాయని చెప్పారు. ఇక నుంచి అలాంటి వారిపై ఉక్కు పాదం మోపుతాం అని అన్నారు. ఈ కార్యక్రమం అలాంటి వారికి ఓ హెచ్చరిక అన్నారు.
TWO LAKH kilos of #GANJA will be BURNT shortly in #AndhraPradesh. Apparently the largest in the country so far. Wondering how many ppl around would be HIGH. Must be like a big rave party🤣 I mean, they have drone cameras, speakers, sound systems,fancy tents
How do they even😂😂😂 pic.twitter.com/Pc5oizPD4h— Revathi (@revathitweets) February 12, 2022