ఈ మధ్య అన్నీ రంగాలలో విషాద ఘటనలు వరుసగా జరుగుతూ వస్తున్నాయి. తాజాగా.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో విషాదం చోటు చేసుకుంది. ఏపీ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. స్ట్రోక్ వచ్చిన వెంటనే ఆయన్ని హైదరాబాద్ లోని అపోలో హాస్పిటల్ కి తరలించారు. కానీ.., పల్స్ దొరక్కపోవడం, ఊపిరి తీసుకోవడం కూడా కష్టంగా మారడంతో ఆయన ఆసుపత్రిలోనే తుది శ్వాస విడిచారు. మంత్రి మరణంతో వైసీపీ శ్రేణుల్లో విషాదం అలుముకుంది. సీఎం జగన్ మోహన్ రెడ్డికి విషయం తెలియగానే.. మేకపాటి కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి మాట్లాడినట్టు సమాచారం. ఏదేమైనా.. రాష్ట్ర మంత్రి ఈ విధంగా అకాల మరణం చెందటం బాధాకరమైన విషయం. మేకపాటి గౌతమ్ రెడ్డి ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుందాం.