అమరావతి- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థానం కొత్త పాలకమండలిని నియమించింది. మొత్తం 25 మందితో టీటీడీ పాలకమండలిని ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. టీటీడీ పాలకమండలిలో ఆంధ్రప్రదేశ్ నుంచి నలుగురు, తెలంగాణ నుంచి నలుగురు, తమిళనాడు నుంచి ముగ్గురు, కర్ణాటక నుంచి ఇద్దరు, మహారాష్ట్ర నుంచి ఒకరు స్థానం దక్కించుకున్నారు. ఎక్స్అఫిషియో సభ్యులుగా వైసీపీ ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్రెడ్డి, భూమన కరుణాకర్రెడ్డి కొనసాగుతారని ఏపీ దేవాదయ శాఖ పేర్కొంది.
ఇక కొత్త ఏర్పటు చేసిన టీటీడీ పాలకమండలిలో ప్రముఖ పారిశ్రామిక వేత్త మైహోం రామేశ్వర రావు, ఫార్మా కంపెనీ హేటిరో చైర్మెన్ పార్దసారధి రెడ్డి, మారంశెట్టి రాములు, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, ముంబాయికి చెందిన రాజేశ్ శర్మ, ఇండియా సిమెంట్స్ శ్రీనివాసన్ రెండో వసారి సభ్యత్వాన్ని దక్కించుకున్నారు. వ్యాపార వేత్త మారుతి, ఆడిటర్ సనత్, యంయస్యన్ ల్యాబ్స్ జీవన్ రెడ్డి, కోల్కతాకు చెందిన సౌరభ్ లకు సైతం టీటీడీ పాలకమండలిలో చోటు దక్కింది.
మహారాష్ట్ర నుంచి శివసేనా కార్యదర్శి మిలింద్కు పాలక మండలిలో అవకాశం కల్పించారు. తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి జాబితా రాష్ట్రాల వారిగా చూస్తే.. ఏపీ నుంచి పోకల అశోక్ కుమార్, మల్లాడి క్రిష్ణారావు, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, గొర్ల బాబూరావు లకు స్థానం దక్కింది. తెలంగాణ నుంచి జూపల్లి రామేశ్వరావు, రాజే శర్మ, పార్థసారధి రెడ్డి, కల్వకుర్తి విద్యాసాగర్ లకు పాలక మండలిలో స్థానం కల్పించారు.
తమిళనాడు నుంచి శ్రీనివాసన్, ఎమ్మెల్యే నందకుమార్, కన్నయ్య లు ఉండగా, కర్ణాటక నుంచి ఎమ్మెల్యే విశ్వనాధ్రెడ్డి, శశిధర్ లు ఉన్నారు. ఇక మహారాష్ట్ర నుంచి శివసేనా కార్యదర్శి మిలింద్కు టీటీడీ పాలక మండలిలో స్థానం కల్పించారు. టీటీడీ చైర్మెన్ గా రెండోసారి వైవీ సుబ్బారెడ్డిని నియమించిన సంగతి తెలిసిందే. మొత్తం 25 మందితో టీటీడీ బోర్డ్ కొలువుతీరనుంది.