ఇటీవల కాలం సినీ రాజకీయ రంగాల్లో వరుస విషాధాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా తెలుగు దేశం పార్టీ సీనియర్ నేత , మాజీమంత్రి జేఆర్ పుష్ప రాజ్ కన్నుమూశారు. ఏడాది క్రితం కరోనా బారిన పడిన ఆయన..అనంతరం కోలుకున్నప్పటికీ ఇతర అనారోగ్య సమస్యలు చుట్టు ముట్టాయి. ఈక్రమంలో ఇటీవలే పుష్పరాజ్ ను గుంటూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ చిక్సిత పొందుతూ గురవారం కన్నుమూశారు. దీంతో ఆయన కుటుంబ సభ్యులతో పాటు అభిమానులతో తీవ్ర విషాధంలో మునిపోయారు. పలువురు రాజకీయ ప్రముఖులు పుష్పరాజ్ కి నివాళ్పరించారు.
తెదేపాలో అతి ముఖ్యనాయకుల్లో పుష్పరాజ్ ఒకరు. ఆ పార్టీ ఆవిర్భావం నుంచి తెలుగుదేశంలోనే ఉన్న పుష్పరాజ్.. 1983, 1985లో తాడికొండ నియోజకవర్గం నుంచి వరుసగా రెండు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అధ్యాపక వృత్తిని వదిలి ఎన్టీఆర్ పిలుపుతో రాజకీయాల్లోకి వచ్చి అంచెలంచెలుగా ఎదిగారు. ఎన్టీఆర్ కేబినెట్లో మొదటి సారిగా మంత్రిగా పనిచేశారు. 1994లో పొత్తు భాగంగా టికెట్ దక్కలేదు. మళ్లీ 1999లో తెదేపా తరఫున తాడికొండ నుంచే పోటీ చేసి మూడోసారి విజయం సాధించారు. అనంతరం 2004లో ఓటమి పాలయ్యారు. 2017లో ఏపీ ఆహార కమిషన్ ఛైర్మన్గా పనిచేశారు. పుష్పరాజ్ మృతిపట్ల తెలుగుదేశం పార్టీ నాయకులు సంతాపం తెలిపారు. మాజీమంత్రి పుష్పరాజ్ మృతి పట్ల తెదేపా అధినేత చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
నిబద్ధతతో, నిజాయితీతో పుష్పరాజ్ చేసిన రాజకీయం నేటి యువతకు ఆదర్శంగా నిలిచారని ఆయన తెలిపారు. శాసనసభ్యుడిగా, మంత్రిగా ప్రజలకు ఎనలేని సేవలందించారని పలువురు రాజకీయ నేతలు అన్నారు. కల్తీ ఆహార పదార్థాలను నియంత్రించడంలో కీలకపాత్ర పోషించారని పేర్కొన్నారు. పలువురు తెదేపా సీనియర్ నేతలు, మాజీ మంత్రులు ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు తమ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.