ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో పలువురు ప్రభుత్వ ఉద్యోగులు బదిలీలు కానున్నారు.
ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు జగన్ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బదిలీలపై ఉన్న నిషేధాన్ని తాత్కాలికంగా ఉపసంహరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మే 22 నుంచి 31 వరకు బదిలీలు చేయనుంది. ఈ మేరకు విధి విధానాలను ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. రిక్వెస్ట్, అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్స్ లో ..రెండు కేటగిరీలుగా ఉద్యోగుల బదిలీ ఉంటుందని ప్రభుత్వం తెలిపింది. గరిష్టంగా రెండేళ్లు ఒకేచోట పనిచేసిన వారిని రిక్వెస్ట్పై బదిలీ చేయనున్నారు.
అలానే ఐదేళ్లు ఒకే చోట పనిచేసిన ప్రభుత్వ ఉద్యోగులను రిక్వెస్ట్పై బదిలీ చేయనున్నట్లు ఏపీ సర్కార్ తెలిపింది. 2023 ఏప్రిల్ 30 నాటికి 5 ఏళ్లు సర్వీస్ పూర్తి చేసుకున్న వాళ్లు బదిలీలకు అర్హులుగా ప్రభుత్వం పేర్కొంది. టీచర్లతో పాటు పలు ఇతర శాఖాలకు చెందిన ఉద్యోగులకు వేరు వేరుగా గైడ్ లైన్స్ జారీ చేసింది. ఈ నెల 22 నుంచి 31 వరకూ బదిలీలకు అవకాశం కల్పిస్తున్నట్లు ఉత్తర్వుల్లో వెల్లడించింది. రిజిస్ట్రేషన్, ఎక్సైజ్, వాణిజ్య పన్నులు, రవాణా, వ్యవసాయ వంటి శాఖల్లో పని చేసే ఉద్యోగుల బదిలీకి ఆర్ధిక శాఖ అనుమతి ఇచ్చింది.
అయితే ఈ ఏడాది జూన్ 1 నుండి ఉద్యోగుల బదిలీలపై తిరిగి బ్యాన్ వర్తించనుందని ప్రభుత్వం పేర్కొంది.కరోనా మహమ్మారి కారణంగా రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలపై ప్రభుత్వం నిషేధం ఎత్తివేయలేదు. 2021 డిసెంబర్ లో ఉద్యోగుల పరస్పర బదిలీలకు మాత్రమే ప్రభుత్వం అనుమతిచ్చింది. తాజాగా బదిలీలపై నిషేదం ఎత్తివేసి పూర్తి స్థాయి బదిలీలకు అవకాశం కల్పించడంతో ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి.. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.